Yarapathineni Srinivas : సింహం వేట ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది-వైసీపీ నేతలకు యరపతినేని వార్నింగ్

చంద్రబాబు మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తే సింహం వేట ఎలా ఉంటుందో వైసీపీ నేతలు చూడాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు జగన్ తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమే అని గుర్తు చేశారు.

Yarapathineni Srinivas : సింహం వేట ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది-వైసీపీ నేతలకు యరపతినేని వార్నింగ్

Yarapathineni Srinivas

Yarapathineni Srinivas : చంద్రబాబు మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తే సింహం వేట ఎలా ఉంటుందో వైసీపీ నేతలు చూడాల్సి ఉంటుందని టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ రావు హెచ్చరించారు. పల్నాడులో జరిగిన ప్రతీ హత్య, దాడి లెక్కలు రాసి పెట్టుకున్నామన్నారాయన. ఆంధ్రప్రదేశ్ కు జగన్ తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమే అని గుర్తు చేశారు. రాయలసీమను రత్నాల సీమగా మార్చిన సింహాలు ఎన్టీఆర్, చంద్రబాబులు అని, వారి వారసత్వమే లోకేష్ ది అని యరపతినేని అన్నారు.

chandrababu: గాడి తప్పిన ప్రతి అధికారిపై మేము అధికారంలోకి వచ్చాక చర్యలు: చంద్ర‌బాబు

రాయలసీమలో కులాల కుంపటి పెట్టి ఫ్యాక్షన్ కు అడ్డాగా మార్చిన రాజారెడ్డి, వైఎస్ ల వారసత్వం జగన్ రెడ్డిది అన్నారు. రాజకీయంగా రాయలసీమను అప్రదిష్టపాలు చేసిన గ్రామ సింహాలు జగన్ కుటుంబ సభ్యులే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పల్నాడులో కుప్పకూలుతున్న సామ్రాజ్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే వరుస హత్యలు, ఊచకోతలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, జగన్ ప్రభుత్వం పతనావస్థకు చేరాయన్నారు. సొంత బాబాయ్ ని చంపిన ఏ1 ముద్దాయి ఎవరు? అంటూ.. పిన్నెల్లి మతిభ్రమించి మాట్లాడుతున్న తీరును ఆ పార్టీ నేతలే గ్రహించాలన్నారు. అక్రమ మద్యం, విగ్రహాల దొంగతనంతో పాటు ఎన్నో అసాంఘిక కార్యకలాపాల కేసులు పిన్నెల్లిపై ఉన్నాయన్నారు. 10వ తరగతి ప్రశ్నాపత్రాలు దొంగిలించిన బయోడేటా జగన్ రెడ్డిదన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం తపిస్తూ, పేదలకు అన్నం పెట్టి ఆకలి తీర్చే బయోడేటా లోకేష్ ది అన్నారు యరపతినేని. పేదల కడుపు నింపే పార్టీ తెలుగుదేశం అయితే, పేదల పొట్టకొట్టే పార్టీ వైసీపీ అని ధ్వజమెత్తారాయన.