Sanjay Raut: మధ్యంతర ఎన్నికలొస్తే 100 సీట్లు మావే: శివసేన ఎంపీ సంజయ్ రౌత్

మధ్యంతర ఎన్నికలు వస్తే ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ వంద సీట్లు గెలుస్తుంది. ప్రజలు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారు. మా పార్టీపై నమ్మకంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన శివసేన తన ఓటర్లను కోల్పోయినట్లు కాదు అని సంజయ్ రౌత్ అన్నారు.

Sanjay Raut: మధ్యంతర ఎన్నికలొస్తే 100 సీట్లు మావే: శివసేన ఎంపీ సంజయ్ రౌత్

Sanjay Raut

Sanjay Raut: మధ్యంతర ఎన్నికలు వస్తే ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని శివసేన పార్టీ 100 సీట్లు గెలుస్తుందని అభిప్రాయపడ్డారు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్. ప్రజలు తిరగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా షిండే ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Cab Driver: ప్యాసింజర్‌ను కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్

‘‘మధ్యంతర ఎన్నికలు వస్తే ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ వంద సీట్లు గెలుస్తుంది. ప్రజలు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారు. మా పార్టీపై నమ్మకంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన శివసేన తన ఓటర్లను కోల్పోయినట్లు కాదు’’ అని సంజయ్ రౌత్ అన్నారు. షిండే ఆధ్వర్యంలోని ప్రభుత్వం మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ విజయం అనంతరం షిండే మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి తమ కూటమి 200 అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఒకవేళ అది జరగకపోతే తాను రాజకీయాల్ని వదిలేసి, వ్యవసాయం చేసుకుంటానని సవాల్ విసిరారు.

SpiceJet Flight: కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన స్పైస్ జెట్ విమానం

మరోవైపు విశ్వాస పరీక్షలో తనకు అనుకూలంగా ఓటు వేయని, థాక్రేకు మద్దతుగా ఉన్న 14 మంది ఎమ్మెల్యేలకు సోమవారం షిండే నోటీసులు జారీ చేశారు. శివసేన విప్ (షిండే క్యాంప్ ఎమ్మెల్యే) జారీ చేసిన విప్ ధిక్కరించినందుకు సమాధానం చెప్పాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఇందులో ఉద్ధవ్ థాక్రే కొడుకు ఆదిత్య థాక్రేను మినహాయించారు. బాలసాహెబ్ గౌరవార్థం ఆయనకు నోటీసులు ఇవ్వలేదని షిండే ఆధ్వర్యంలోని శివసేన పేర్కొంది.