ప్రేమించలేదని బాలికపై మరుగుతున్న నూనె పోసిన యువకుడు

  • Published By: nagamani ,Published On : July 2, 2020 / 12:07 PM IST
ప్రేమించలేదని బాలికపై మరుగుతున్న నూనె పోసిన యువకుడు

ప్రేమించలేదనే కోపంతో అమ్మాయిలపై దాడులకు పాల్పడే ఘటనలు పరిపాటిగా మారిపోయాయి. ఎక్కడోకచోట ఇటువంటివి జరుగుతునే ఉన్నాయి. అటువంటి ఘటనే పుదుచ్చేరిలోని కిరుమాంబాక్కంలో చోటుచేసుకుంది. ఎంతకాలం వెంటపడినా తనను ప్రేమించటంలేదని కోపంతో ఓ వ్యక్తి బాలికపై మరుగుతున్న నూనె పోసాడు. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్సపొందుతోంది.

వివరాల్లోకి వెళితే..పుదుచ్చేరిలోని కిరుమాంబాక్కం ప్రాంతానికి చెందిన 9క్లాస్ చదువుతున్న 14 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల మాదేష్‌ అనే యువకుడు ప్రేమించానంటూ వెంటపడుతు వేధిస్తున్నాడు. పారామెడికల్ కోర్సు పూర్తి చేసి ఉద్యోగం లేక ఖాళీగా తిరుగుతున్న మాదేశ్ 14 ఏళ్ల బాలిక వెంట పడుతూ ప్రేమించమని వేధిస్తున్నాడు. నాకు ఇష్టం లేదని ఎంతగా చెప్పినా వినకుండా వేధింపులకు గురిచేస్తున్నాడు. అయినా సరే బాలిక నాకు ఇష్టం లేదని తెగేసి చెప్పేసింది. పెద్దవాళ్లు కూడా మందలించారు. బాలిక జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో భరించలేకపోయాడు..ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. అయినా వినలేదు.

దీంతో జూన్ 1న ఆ బాలిక అన్నదమ్ములు..తండ్రి కలిసి చేపలు పట్టటానికి వెళ్లటంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై సలాసలా మరుగుతున్న నూనె పట్టుకెళ్లి కిటికీలోంచి పోశాడు. దీంతో నూనె వేడికి తీవ్రంగా గాయపడిన బాలిక పెద్దగా కేకలు వేసింది. ఆ సమయంలో ఇంట్లోనే వేరే పనిలో ఉన్న తల్లి పరుగు పరుగున వచ్చేసరకి కూతురు పరిస్థితి విని తల్లడిల్లిపోయింది. చుట్టుపక్కలవారిని కేకేసింది. స్థానికులు సహాయంతో కూతుర్ని ఆస్పత్రిలో చేర్చింది. వెంటనే ట్రీట్ మెంట్ చేశారు డాక్టర్లు.

అనంతరం బాలిక ఫిర్యాదుతో కిరుమాంబాకం పోలీసులు ఆ ఉన్మాదిపై కేసు నమోదుచేసి, పరారీలో ఉన్న మాదేష్‌ను మంగళవారం (జులై 1,2020)సాయంత్రం అరెస్ట్‌ చేశారు.

Read:కొడుకు కరోనా బారిన పడ్డారన్న బాధతో తండ్రి గుండెపోటుతో మృతి