Raja Singh: బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్యే రాజా సింగ్ ఫిర్యాదు
గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ బీజేపీ నేత, హైదరాబాద్లోని గోషామహల్ నియోజక వర్గ ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పారు.
Raja Singh: గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ బీజేపీ నేత, హైదరాబాద్లోని గోషామహల్ నియోజక వర్గ ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పారు. ఈ మేరకు ఆయన మంగళ్హాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ పోలీసులను కోరారు. ఆయన నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతామన్నారు.
bjp: 10 లక్షల ఉద్యోగాలు ప్రకటించి యువతలో మోదీ నమ్మకాన్ని నింపారు: కేంద్ర మంత్రులు
కాగా , ఓ మతానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారంటూ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లోనే రాజా సింగ్పై కేసు నమోదైన విషయం తెలిసిందే. కాంచన్బాగ్ పోలీసులు ఈ కేసులో విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ ఫిర్యాదు చేయడం గమనార్హం.