Marri Shashidhar Reddy : తెలంగాణ కాంగ్రెస్కు బిగ్ షాక్? బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి? అమిత్ షాను కలిసిన మర్రి
మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో త్వరలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. మంచి రోజు చూసుకుని బీజేపీ కండువా కప్పుకుంటారని సమాచారం.
Marri Shashidhar Reddy : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తప్పదా? కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తక మానవు. మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. డీకే అరుణ, బండి సంజయ్ లు.. మర్రి శశిధర్ రెడ్డి అమిత్ షా దగ్గరికి తీసుకెళ్లారు. మర్రి శశిధర్ రెడ్డి అమిత్ షా ను కలవడంతో.. త్వరలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. త్వరలోనే మంచి రోజు చూసుకుని ఆయన బీజేపీలో చేరనున్నారని సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకోనున్నారు.
ఇటీవలే బీజేపీ నేతలతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. దీంతో ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. దీనిపై స్పందించిన మర్రి శశిధర్ రెడ్డి తాను పార్టీ మారడం లేదని వివరణ ఇచ్చారు. కలిసి ప్రయాణం చేసినంత మాత్రాన పార్టీ మారుతున్నట్లా అని ఎదురు ప్రశ్నించారు. ఆయన ఇలా అన్నారో లేదో.. రెండు రోజుల్లో అమిత్ షాను కలవడం హాట్ టాపిక్ గా మారింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి పార్టీ మారుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మర్రి భేటీ కావడం చర్చనీయాంశమైంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి ఆయన అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిణామాలపై నేతలు అమిత్ షాతో చర్చించారు.