చింత గింజ మీద కేసీఆర్..పాలమీద గులాబీ బాస్

చింత గింజ మీద కేసీఆర్..పాలమీద గులాబీ బాస్

cm kcr image tamarind seed : తెలంగాణా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ, తెలంగాణ గవర్నర్ తమిళసై, మంత్రులు,ఎమ్మెల్యేలు ఇలా ప్రతీ ఒక్కరూ శుభాకాంక్షలు తెలిపారు. ఈక్రమంలో హైదరాబాద్ లోని పాతబస్తీకి చెందిన లా స్టూడెంట్ సూక్ష్మ కళాకారిణి రామగిరి స్వారిక తన సూక్ష్మ కళతో ‘చింతగింజ’మీద సీఎం కేసీఆర్ బొమ్మను చెక్కింది.

ఇప్పటికే స్వారిక తన సూక్ష్మ కళతో ఎన్నో కళాఖండాలను సృష్టించారు. పలువురు దేవతమూర్తులు, రాజకీయ నాయకుల చిత్రాలను వివిధ సూక్ష్మ వస్తువులపై వేసి పలువురి ప్రశంసలు పొందుతోంది. గౌలిపురా అంబికానగర్‌ ప్రాంతానికి చెందిన రామగిరి శ్రీనివాస్, శ్రీలత కూతురు రామగిరి స్వారిక 2018లో ఎంబీఏ పూర్తి చేసింది.

ఈ క్రమంలో కేసీఆర పుట్టిన రోజు సందర్భంగా స్వారిక చింతగింజ, పాలపై కేసీఆర్‌ చిత్రంతో పాటు పాలపై టీఆర్‌ఎస్‌ జెండా… జై తెలంగాణ… నినాదం వేసి పలువురిని ఆకట్టుకుంది. స్వారిక ఇప్పటి వరకు రెండు వేలకు పైగా మైక్రో చిత్రాలను వేసింది. ఇటీవల 4042 బియ్యం గింజలపై భగవద్గీతను రాసిన విషయం తెలిసిందే.