Supreme Court : ఉచిత హామీలతో తీవ్ర ఆర్థిక సమస్యలు సృష్టిస్తున్న రాజకీయ పార్టీలు : సుప్రీంకోర్టు
రాజకీయ పార్టీల ఉచిత హామీల విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల వేళల్లో ఉచిత హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీల నేతలు తీవ్ర ఆర్థిక సమస్యలు సృష్టిస్తున్నారని కోర్టు పేర్కొంది. ఉచిత హామీల అంశాన్ని పరిశీలించేందుకు అత్యున్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ కేసును విచారించింది.
Supreme Court : రాజకీయ పార్టీల ఉచిత హామీల విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల వేళల్లో ఉచిత హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీల నేతలు తీవ్ర ఆర్థిక సమస్యలు సృష్టిస్తున్నారని కోర్టు పేర్కొంది. ఉచిత హామీల అంశాన్ని పరిశీలించేందుకు అత్యున్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ కేసును విచారించింది.
నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, అధికార, విపక్ష పార్టీలు, ఆర్బీఐతో పాటు ఇతర సంస్థలతో అపెక్స్ బాడీని ఏర్పాటు చేసి.. రాజకీయ పార్టీల ఉచిత హామీల నియంత్రణపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు తెలిపింది. ఉచితం ఎవరికి కావాలి? ఎవరు వాటిని వ్యతిరేకిస్తున్నారు? వారు తమ తమ నిర్ణయాలను వెల్లడించాలని సూచించింది. ఆర్బీఐ, నీతి ఆయోగ్, విపక్ష పార్టీలు సమగ్రమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ధర్మాసనం తెలిపింది.
Supreme court : ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆందోళన..నిరోధించే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచన
ఉచిత హామీల నియంత్రణపై నివేదిక తయారు చేసి ఇవ్వాలని కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ రాజకీయ పార్టీల ఉచిత హామీలు ఆర్థిక విధ్వంసానికి దారి తీస్తోందని చెప్పారు. ఎన్నికల్లో ఉచిత హామీలపై ఇటీవలే సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని నిరోధించే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి పలు కీలక సూచనలు చేసింది.