స్వస్తిక్ గుర్తు ఉంటేనే ఓటు లెక్కించాలన్న హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం

  • Published By: bheemraj ,Published On : December 4, 2020 / 11:00 AM IST
స్వస్తిక్ గుర్తు ఉంటేనే ఓటు లెక్కించాలన్న హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం

Telangana government objected High Court orders : స్వస్తిక్ గుర్తు ఉంటేనే ఓటు లెక్కించాలన్న హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈసీ ఇచ్చిన సర్క్యలర్ ను రద్దు చేసే అధికారం హైకోర్టుకు లేదని తెలిపింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేయనుంది. కాసేపట్లో హైకోర్టులో ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది.



బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పు ఇచ్చింది. బీజేపీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నది. ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చింది. బ్యాలెట్ పేపర్ పై స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నికల సంఘం నిన్న రాత్రి జారీ చేసిన సర్క్యులర్ చెల్లదని తెలిపింది.



బ్యాలెట్ పేపర్ పై స్వస్తిక్ ముద్రతో పాటు ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాలెట్ పేపర్ పై పెన్నుతో మార్క్ చేసినా ఓటేసినట్టేనని పేర్కొంది. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై బీజేపీ మండిపడింది. ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ శుక్రవారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు స్వస్తిక్ ముద్రతో ఓటుగా పరిగణించాలని పేర్కొంది.