WTC Final: రాణిస్తున్న కెప్టెన్, వైస్ కెప్టెన్.. రెండోరోజూ ఆటకు ఆటంకం.. స్కోరు 120/3

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించినా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానె నిలకడగా ఆడుతున్నారు.

WTC Final: రాణిస్తున్న కెప్టెన్, వైస్ కెప్టెన్.. రెండోరోజూ ఆటకు ఆటంకం.. స్కోరు 120/3

Wtc Final

WTC Final Ind vs NZ Live Update: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించినా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానె నిలకడగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా టీ బ్రేక్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 55.3 ఓవర్లలో 120 పరుగులు చేసింది.

రోహిత్ శర్మ, షుబ్మాన్ గిల్ ఇన్నింగ్స్‌ ప్రారంభించగా.. భారత్‌కు మంచి ఆరంభం వచ్చింది అనుకునేలోగా.. మొదటి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. టీమిండియా స్కోరు 62 ప‌రుగుల వ‌ద్ద రోహిత్ శ‌ర్మ‌, ఆ వెంట‌నే 63 ప‌రుగుల వ‌ద్ద శుభ్‌మన్ గిల్ అవుట్ అయ్యారు. కొద్దిసేప‌టి త‌ర్వాత టీమిండియా స్కోరు 88గా ఉన్నప్పుడు చ‌తేశ్వ‌ర్ పుజారా కూడా అవుటయ్యాడు. గోడలా నిలబడి ఆడుతున్నట్లుగా కనిపించిన పుజారా అవుట్ అవడంతో న్యూజిలాండ్ బౌలర్లు ఊపిరిపీల్చుకున్నారు.

అయితే, తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే, కోహ్లీ జాగ్రత్తగా ఆడుతున్నారు. రహానే 54బంతుల్లో 13పరుగులు చేయగా.. కోహ్లీ 94బంతుల్లో 35పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. అయితే, బ్యాడ్ లైట్ కారణంగా రెండవరోజు కూడా ఆటకు అంతరాయం కలిగింది.