Thunderstorm : మందపై పిడుగుపాటు.. 73 గొర్రె పిల్లలు మృతి

నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామంలో పిడుగు పాటుతో 73 గొర్రె పిల్లలు మృతి చెందాయి.

Thunderstorm : మందపై పిడుగుపాటు.. 73 గొర్రె పిల్లలు మృతి

Thunderstorm

Thunderstorm : నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామంలో పిడుగు పాటుతో 73 గొర్రె పిల్లలు మృతి చెందాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ తరుణంలోనే జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడ్డాయి. రుద్రసముద్రం గ్రామ సమీపంలో శనివారం తెల్లవారు జామున పిడుగు పడటంతో మందలో ఉన్న 73 గొర్రె పిల్లలు మృతి చెందాయి.

Read More : Lovers : ప్రేమించినావారితో ఎక్కువ సమయం గడిపితే ఏమవుతుందో చెబుతున్న నిపుణులు

ఈ విషయం తెలియడంతో గొర్రెపిల్లల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు. గొర్రెల యజమానులు మల్లప్ప, సాయన్న, అంజలప్ప, జాంబయ్యలు పిడుగు పడిన విషయాన్నీ స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమను ఎలాగైనా ఆదుకోవాలని కోరారు.