Tollywood: ఎంటర్‌టైన్‌మెంట్ లేటెస్ట్ టాలీవుడ్ 30 అప్‌డేట్స్..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హస్పిటల్‌కు వెళ్ళి టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది..

Tollywood: ఎంటర్‌టైన్‌మెంట్ లేటెస్ట్ టాలీవుడ్ 30 అప్‌డేట్స్..

Tollywood Entertainment Latest 30 News

Tollywood: పవన్‌కు పాజిటివ్..
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హస్పిటల్‌కు వెళ్ళి టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది.

హాస్పిటల్‌లో స్టార్ కమెడియన్..
తమిళ స్టార్ కమెడియన్ వివేక్ హార్ట్ ఎటాక్‌తో హాస్పిటల్‌లో చేరారు. ఒక రోజు ముందు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వివేక్.. కొన్ని గంటలకే హార్ట్ ఎటాక్‌కు గురయ్యారు.. పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

అమాయకుడిగా..
కొరటాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా అనౌన్స్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో తారక్ ఓ పల్లెటూరి అమాయకపు పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. తారక్ క్యారెక్టర్‌లో రెండు డిఫరెంట్ షేడ్స్‌ను కొరటాల చూపించబోతున్నారు.

డ్యూయల్ రోల్..
సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి జోరుమీద ఉన్నారు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. రీసెంట్‌గా ‘వకీల్ సాబ్’ తో మంచి సక్సెస్ అందుకున్న పవన్, హరీష్ శంకర్‌తో చేయబోతున్న సినిమాలో ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్‌లో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఫిమేల్ వెర్షన్..
రీసెంట్‌గా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ సాధించింది పవర్‌స్టార్ ‘వకీల్ సాబ్’ మూవీ. ఈ సినిమాలో మగువా పాట ఇంకా హిట్ అయ్యింది. ఈసాంగ్ ఫిమేల్ వెర్షన్‌ను రిలీజ్ చేయగా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

బిగ్ ఫైట్..
కరోనా వేవ్‌లో కూడా ఆచార్య షూటింగ్ సూపర్ ఫాస్ట్‌గా జరుగుతుంది. ప్రస్తుతం కోకాపేటలోని థర్మస్థలి సెట్‌లో రామ్ చరణ్ – సోనూ సూద్ మధ్య భారీ ఫైట్‌ను షూట్ చేస్తున్నారు.

అందరివాడు..
చేతికి ఎముకలేదన్నట్టు దానం చేస్తూ వెళ్తోన్న బాలీవుడ్ స్టార్ సోనూ సూద్‌‌కు సోషల్ మీడియాలో క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. రీసెంట్‌గా సోనూ ట్విట్టర్ ఫాలోవర్స్ 60 లక్షలు దాటారు.

గోష్ఠి..
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో.. తమిళ, తెలుగు భాషల్లో ఎస్.కళ్యాణ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు గోష్ఠి అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగును జనవరిలో ప్రారంభించి, ఫాస్ట్‌గా కంప్లీట్ చేశారు. ఏప్రిల్ నెలాఖరుకి రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.

త్రివిక్రమ్‌తో..
కొంత గ్యాప్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిన పవర్‌స్టార్ త్వరలో తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేసే సినిమా పూర్తయ్యాక ఇది సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం.

దేవిశ్రీ మ్యూజిక్…
కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ స్టార్ రామ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనుంది. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించే ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చబోతున్నారు.

దుమ్ము దులిపి..
బాక్సాఫీస్ బద్దకాన్ని వదిల్చి.. పట్టిన దుమ్మును దులిపేసింది కర్ణన్ సినిమా. ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ కోలీవుడ్‌లో రిలీజ్ అయిన రోజు నుంచే రచ్చ చేస్తోంది. ఈ ఐదు రోజుల్లో దాదాపు 40 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిందీ మూవీ..

భారీగానే..
దిల్ రాజు బ్యానర్‌లో స్టార్ డైరెక్టర్ శంకర్- రామ్ చరణ్ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకుగాను శంకర్‌కు దిల్ రాజు భారీ రెమ్యునరేషన్‌ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

ఓ పనైపోయింది..
దృశ్యం 2 సినిమా షూటింగ్ నాన్ స్టాప్‌గా సాగుతూ వెళుతోంది. నారప్ప తరువాత వెంకటేష్ పూర్తిగా ఈ సినిమాకే టైమ్ కేటాయించడంతో.. రీసెంట్‌గా ఆయన పోర్షన్ షూటింగ్ కూడా పూర్తయింది. దాంతో వెంకీ ఎఫ్ 3 కోసం పూర్తి సమయాన్ని కేటాయించనున్నారు.

సరదా క్షణాలు..
దృశ్యం-2 షూటింగ్ లో బిజీగా ఉంది సీనియర్ హీరోయిన్ మీనా. లొకేషన్ నుండి అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడుసోషల్ మీడియాలో పంచుకుంటుంది. నదియాతో కలిసి షూటింగ్‌లో చేసిన అల్లరి.. కొన్ని ఫన్ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంది మీనా.

మోసపోయానంటూ..
కన్నడ హీరోయిన్.. నిక్కీ గల్రానీ తను మోసపోయానంటూ.. పోలీసులకు కంప్లైంట్ చేసింది. 2016 లో తన స్నేహితుడు నిఖిల్‌కు 50 లక్షలు ఇచ్చానని అవి తిరిగి ఇవ్వకుండా బాగా ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.

6 ఏళ్ళ తరువాత…
6 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు హీరోయిన్ మీరాజాస్మిన్.. మ‌ల‌యాళ డైరెక్టర్ స‌త్య‌న్ అంతికాడ్ రూపొందిస్తున్న సినిమాతో మీరా జాస్మిన్ రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నట్లు ద‌ర్శ‌కుడు తెలిపాడు. జయరాం, మీరా జాస్మిన్‌లు ప్రధాన పాత్రలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.

ఇంప్రెస్సివ్ టీజర్..
యంగ్ స్టార్స్ హ‌ర్ష్ కానుమిల్లి, సిమ్రాన్ చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఫన్ ఎంట‌ర్‌టైన‌ర్ సెహ‌రి. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ టీజర్ శుక్రవారం రిలీజ్ చేశారు.

ఇల్లే కదా స్వర్గసీమ..
మంచుకొండల్లో 30 కోట్లతో తాను కట్టుకున్న ఇంటిని స్వర్గం అంటోంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న తన ఇంటి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పడవలో అప్సరా..
ట్రెడిషనల్ డ్రెసింగ్‌లో పడవ నడుపుతున్న ఫోటోను అభిమానులతో పంచుకుంది హీరోయిన్ అప్సరా రాణి. అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్‌తో సందడి చేస్తుంటుంది.

నీడనెప్పుడు చూడాలి..
ఎప్పుడూ సూర్యున్ని చూస్తుంటే.. నీడను చూసే అవకాశం ఉండదు అంటోంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఫిలాసఫీ చెపుతూ.. న్యూ క్లిక్‌ను షేర్ చేసింది.

ప్రపంచంతో పనిలేదు..
తనకు ప్రపంచంతో పనిలేదు అంటోంది మాజీ హీరోయిన్ రేణూ దేశాయ్. ప్రశాంత వాతావరణం… ఫీస్ ఫుల్ లైఫ్ ఉంటే.. ఒంటరితనం కూడా బాగుంటుందంటోంది.. ప్రశాంతంగా ధ్యానంలో ఉన్న పిక్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నారామె.

యువరాణి..
ఈ మధ్య బాగా బరువు తగ్గిన హీరోయిన్ హన్సిక.. యువరాణిలా తయారయ్యింది. జ్యూవెలరీతో పాటు ట్రెషిషనల్ డ్రెస్‌లో మెరిసిపోతున్న పిక్స్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది హన్సికా..

భర్తకు ప్రేమతో..
తన భర్తకు ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్.. ఎప్పుడూ ఇలానే ప్రేమగా ఉండాలని కోరుకుంది.

ఫీల్ హ్యాపీ..
ఈ మధ్య కరోనా పాజిటీవ్ రావడంతో.. హోమ్ క్వారంటైన్‌లో ఉన్న హీరోయిన్ నివేధా థామస్.. హ్యాపీ పిక్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. కరోనా నెగెటివ్ రావడంతో నివేదా ఫుల్ ఖుషీ అవుతోంది.

11 ఏళ్ళ ప్రస్థానం..
యంగ్ స్టార్ శర్వానంద్-సాయి కుమార్ లీడ్ రోల్స్ చేసిన సినిమా ప్రస్థానం. దేవ కట్టా డైరెక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ అయ్యి 11 ఏళ్లు అవుతుంది. 2010 ఏప్రిల్ 16న రిలీజ్ అయిన సినిమా సూపర్ హిట్ అయ్యింది..

బ్రేక్ కోసం..
ఇండస్ట్రీకి వచ్చి 11 ఏళ్లు అవుతున్నా.. సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ప్రస్థానం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సందీప్.. 26కు పైగా సినిమాలు చేశారు. కానీ ఏ సినిమా సందీప్‌ను స్టార్‌గా నిలబెట్టలేదు.. మరో నాలుగు సినిమాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి.

బ్యాడ్ డేస్…
అపరిచితుడు కథ తనదని, అనుమతి లేకుండా రీమేక్ చేయడం నేరమని డైరెక్టర్ శంకర్‌కు లేఖ రాశారు ఆస్కార్ రవిశంకర్. అయితే అధికారికంగా ఈ లేఖ నిజమా, కాదా అన్నది తెలియాల్సిఉంది.

బ్రేక్ పడింది…
మహారాష్ట్రా కొత్త నిబంధనల ప్రకారం షూటింగ్స్‌కు బ్రేక్ పడింది. దీంతో ఆదిపురుష్, లైగర్ వంటి సినిమా షూటింగ్స్ ఆగిపోయినట్టు తెలుస్తోంది.

కోర్ట్ డ్రామా..?
చిరంజీవితో డైరెక్టర్ బాబీ చేయబోతున్న సినిమా కోర్ట్ డ్రామా అన్నట్టు తెలుస్తోంది. ఠాగూర్ తరహా డైలాగ్స్‌తో, వాద ప్రతివాద అంశాలతో చిరు మూవీ ప్లాన్ చేస్తున్నాడట బాబీ.

ఆహా నిర్మాతగా…
ఆర్టీ వర్క్స్ బ్యానర్‌పై రవితేజ త్వరలోనే ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఆహా ఓటీటీ కోసం అల్లు అరవింద్‌తో కలిసి రవితేజ వర్క్ చేస్తున్నట్టు సమాచారం.