Balka Suman Slams BJP : బుల్డోజర్లు, రేప్‌లు, స్కామ్‌లు.. ఇదే బీజేపీ- బాల్క సుమన్

తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల రూపంలో సంపదను పంచి పెడుతుంటే, ఇద్దరు దోస్తుల కోసం దేశ సంపదను మోదీ ప్రభుత్వం కార్పొరేట్ గద్దలకు పంచి పెడుతోంది.

Balka Suman Slams BJP : బుల్డోజర్లు, రేప్‌లు, స్కామ్‌లు.. ఇదే బీజేపీ- బాల్క సుమన్

Balka Suman

Balka Suman Slams BJP : తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సీఎం కేసీఆర్ సై అంటే సై అంటున్నారు. బీజేపీ సర్కార్ టార్గెట్ గా విరుచుకుడుపతున్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలను తప్పుపడుతున్నారు. అదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. అవినీతి పాలన, కుటుంబపాలన అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.

తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీజేపీపై ఫైర్ అయ్యారు. తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీని కమలం పార్టీ అనడం కంటే కార్పొరేట్ పార్టీ అనడం సబబు అని అన్నారు. మీ డబుల్ ఇంజిన్ కు దేశ ప్రజలు ఎర్రజెండా చూపిస్తారని హెచ్చరించారు. టీఆర్ఎస్ సర్కారుపై ఒక్క అవినీతి ఆరోపణకు సంబంధించి అయినా ఆధారాలు బయటపెట్టారా? అని కమలం పార్టీ నేతలను ప్రశ్నించారు బాల్క సుమన్. బీజేపీ చేపట్టేది సంగ్రామ యాత్ర కాదని, పాపాల యాత్ర అని అభివర్ణించారు.

CM KCR : దుర్మార్గమైన విధానాలు దేశానికి అశనిపాతంలా దాపురించాయి : సీఎం కేసీఆర్

కర్ణాటకలో బీజేపీ మంత్రి అవినీతి ఆరోపణలతో రాజీనామా చేశారని బాల్క సుమన్ అన్నారు. ‘దేశంలో అవినీతిని వ్యవస్థీకృతం చేసిన ఘనులు మోదీ, అమిత్ షా… మీరా మాపై అవినీతి ఆరోపణలు చేసేది?’ అని బాల్క సుమన్ ధ్వజమెత్తారు. బీజేపీ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. బుల్డోజర్లు, రేప్ లు, స్కామ్ లు.. ఇదే బీజేపీ.. అంటూ విరుచుకుపడ్డారు.

TRS Plenary : కేంద్ర సర్కార్‌‌పై కేటీఆర్ నిప్పులు.. ప్లీనరీలో పవర్ ఫుల్ స్పీచ్

తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల రూపంలో సంపదను పంచి పెడుతుంటే, ఇద్దరు దోస్తుల కోసం దేశ సంపదను ఇవాళ నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ గద్దలకు ఎట్ల పంచి పెడుతోంది దేశం మొత్తం చూస్తోంది. ఇది కమలం పార్టీ కాదు, కార్పొరేట్ పార్టీ అని నిరూపించుకుంటూ రూ.11లక్షల కోట్ల బ్యాంకుల బకాయిలు కార్పొరేట్ గద్దలకు మాఫీ చేసినటువంట పార్టీ భారతీయ జనతా పార్టీ. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉండటం వల్ల రాష్ట్రాల్లో, కేంద్రంలో లాభం అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికొక ఓ రాష్ట్రంలో రేషన్ ఇస్తున్నాము కాబట్టి ఓటు వేయాలని అడుగుతున్నారు మీరు. రాబోయే రోజుల్లో మీ డబుల్ ఇంజిన్ కు దేశ ప్రజలు ఎర్రజెండా చూపే పరిస్థితి వస్తుంది” అని బాల్క సుమన్ హెచ్చరించారు.

Telangana : బీజేపీని తిట్టటానికే టీఆర్ఎస్ ప్లీనరీ.. : బండి సంజయ్