BJP MP Arvind Vs MLC Kavitha : ‘పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతా’ : బీజేపీ ఎంపీ అర్వింద్‌పై కవిత ఫైర్..

 బీజేపీ ఎంపీ అర్వింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా మండిపడ్డారు. నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతానంటూ మండిపడ్డారు.

BJP MP Arvind Vs MLC Kavitha : ‘పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతా’ : బీజేపీ ఎంపీ అర్వింద్‌పై కవిత ఫైర్..

TRS MLC Kavitha,Nizamabad, BJP MP Arvind,

MP Arvind Vs MLC Kavita : బీజేపీ ఎంపీ అర్వింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా మండిపడ్డారు. కవిత కాంగ్రెస్ లో చేరటానికి ప్లాన్ వేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై కవిత తీవ్రంగా మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్లుగా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదంటూ అర్వింత్ పై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతానంటూ మండిపడ్డారు. అర్వింద్ నిజామాబాద్ లో యాక్సిడెంటల్ గా గెలిచారని ఇకపై ఆయన ఆటలు సాగవని..ఈసారి అర్వింత్ ఎక్కడ పోటీ చేస్తే ఆయనపై పోటీ చేసి ఓడిస్తానని అన్నారు కవిత. ఎంతటివారినైనా ఇష్టానురీతిగా మాట్లాడటం అర్వింద్ కు అలవాటని అలా ఇష్టానురీతిగా నా గురించి మాట్లాడితే ఎక్కడ కనిపిస్తే అక్కడ పట్టుకుని చితకబాదుతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతానంటూ మండిడపడ్డారు.

అర్వింద్ చదువు గురించి కూడా ఈ సందర్భంగా కవిత విమర్శలు చేశారు. రాజస్థాన్ లో చదువుకున్నానని చెప్పిన అర్వింద్ ఓ ఫేక్ యూనివర్శిటీలో చదువుకున్నారని..ఆయన చదవు సర్టిఫికెట్ ఓఫేక్ అని దీనిపై తాను ఈసీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. నిజామాబాద్ ఎంపీగా గెలిచిన అర్వింద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని అభివృద్ధి చేయటం చేతకాని అర్వింద్ కు నోటీ దురుసు మాత్రం ఎక్కువేనని ఏమాత్రం సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడటం అతనికి అలవాటు అంటూ విమర్శించారు. చిల్లర మాటలు మాత్రమే చేతనైన అర్వింద్ కు పార్లమెంట్ లో మాట్లాడటమే చేతకాదు అంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ లో ఎంపీలు 150 ప్రశ్నలు అడిగితే అర్వింద్ మాత్రం కేవలం 65 ప్రశ్నలే అడిగారంటూ తెలిపారు. నోటికొచ్చినట్లు మాట్లాడే అర్వింద్ కు డిజేట్లలో మాట్లాటం కూడా చేతకాదని నాలుగేళ్లలో అర్వింద కేవలం 5 డిబేట్లలో మాత్రమే పాల్గొన్నారు అంటూ లెక్కలు చెప్పుకొచ్చారు కవిత.

కాగా..బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్సీ కవిత పై అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారు. బంజారాహిల్స్‌లోని ఎంపీ ఇంట్లోకి టీఆర్ఎస్ కార్యకర్తలు చొరబడి అద్దాలు పగలగొట్టారు. ఈక్రమంలో ఎంపీ అర్వింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫైర్ అయ్యారు. ఇష్టానురీతిగా నాగురించి మాట్లాడితే చెప్పుతో కొడతాను అంటూ మండిపడ్డారు.