Texas shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్లోని హాల్టోమ్ సిటీలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. అలాగే, మరో నలుగురికి గాయాలయ్యాయని చెప్పారు.
Texas shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్లోని హాల్టోమ్ సిటీలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. అలాగే, మరో నలుగురికి గాయాలయ్యాయని చెప్పారు. వారిలో ముగ్గురు ప్రభుత్వ అధికారులు ఉన్నారని వివరించారు. ఒక వృద్ధురాలు ఇంట్లో విగతజీవిగా కనపడిందని, మరో వ్యక్తి ఇంటికి సమీపంలో మృతి చెందాడని పోలీసులు చెప్పారు. ఈ కాల్పుల్లో గాయాలపాలైన ముగ్గురికి ఆసుపత్రిలో చికిత్స అందుతోందని, వారి ప్రాణాలకు ముప్పు ఏమీ లేదని తెలిపారు.
bjp: కేసీఆర్ పాలన పోయి, బీజేపీ పాలన రావడం ఖాయమైంది: జేపీ నడ్డా
కాల్పులకు తెగబడ్డ వ్యక్తి మరో ప్రాంతంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. ఈ కాల్పుల ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు వెళ్ళి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. ఆ వ్యక్తి కాల్పులు ఎందుకు జరిపాడన్న వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. కాగా, అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకు 302 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.