YS Sharmila: నిరుద్యోగుల ఆత్మహత్యలు సీఎం కేసీఆర్ హత్యలే: వైఎస్ షర్మిల

రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ సీఎం కేసీఆర్ హత్యలేనని వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. నేరేడుచర్ల మండలం మేడారంలో నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన వైఎస్ షర్మిల.. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి సీఎం కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని..

YS Sharmila: నిరుద్యోగుల ఆత్మహత్యలు సీఎం కేసీఆర్ హత్యలే: వైఎస్ షర్మిల

Sharmila

YS Sharmila: రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ సీఎం కేసీఆర్ హత్యలేనని వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. నేరేడుచర్ల మండలం మేడారంలో నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన వైఎస్ షర్మిల.. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి సీఎం కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని.. నాడు తెలంగాణ కోసం యువత ఆత్మ బలిదానం చేసుకుంటే.. నేడు ఉద్యోగాల కోసం బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. ఉద్యోగ ఖాళీలు ఉన్నా కేసీఆర్ వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కు రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ యువతకు ఉద్యోగాల కల్పన మీద లేదన్నారు.

పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు ఆ కడుపు గోస తెలుస్తుందన్న షర్మిల.. పిల్లలకి మంచి మంచి పదవులు ఇచ్చుకున్న కేసీఆర్ లాంటి వారికి ఎలా తెలుస్తుందన్నారు. జంబో డీఎస్సి పేరుతో ఒకేసారి 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత వైఎస్సార్ దేనని.. ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి కేసీఆర్ కు పట్టింపు లేదు.. ఇప్పటికైనా కేసీఆర్ నిద్ర నుండి లేచి ఉద్యోగ ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేయాలన్నారు. తొలగించిన అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కేసీఆర్ ఇంటికో ఉద్యోగం మాట నిలబెట్టుకోవాలన్నారు.

నిరుద్యోగి నీలకంఠ సాయి ఆత్మహత్య యత్నం చేశారని.. ఆ యువకుడిని పరామర్శించి ధైర్యం చెబుదాం అనుకున్నా.. మొదట బెదిరించి.. ఈ రోజు ఉద్యోగం ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ నాయకులు ఆ యువకుడిని ఇక్కడి నుండి తరలించారన్నారు. నీలకంఠ సాయికి ఉద్యోగం ఇస్తామనడం మా విజయం అని.. మా పోరాటానికి సర్కార్ భయపడుతోంది.. కదులుతుందన్నారు. యువత ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని.. మీకోసం నేను కొట్లాడుతానికే వచ్చానన్నారు.