Tagore Skinne :రవీంద్రనాథ్ ఠాగూర్‌ శరీర రంగుపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌ చర్మం రంగుపై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మేధావులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Tagore Skinne :రవీంద్రనాథ్ ఠాగూర్‌ శరీర రంగుపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Rabindranath Tagore Dark Skinned Comments

భారత జాతీయ గీతం జనగణమన రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌ చర్మం రంగుపై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం (ఆగస్టు 18,2021) కలకత్తాలో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి యూనివర్సిటీని సందర్శించిన కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ మాట్లాడుతు..రవీంద్ర ఠాగూర్ నల్లగా ఉండటంతో తల్లి ఆయన్ని పట్టించుకునేవారు కాదని వివక్ష చూపేవారని..తల్లితో సహా ఆయన కుటుంబంలో అందరి నిరాదరణకు గురయ్యారని వ్యాఖ్యానించారు. ఠాగూర్ నల్లగా ఉండటం వల్ల తల్లి ఆయన్ని ఎప్పుడూ కొడుకుగా ముద్దు చేయలేదని..తల్లే కాకుండా ఆయన బంధువులు కూడా ఆయన్ని పట్టించుకునేవారు కాదని నల్లగా ఉండటం వల్ల వివక్ష చూపారని అన్నారు. పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన్ని చేతుల్లోకి తీసుకోలేదని ఆదరంగా ఒడిలో కూర్చోబెట్టుకోవటం వంటివి చేసేవారు కాదని అన్నారు.

‘‘మంత్రి ఇంకా మాట్లాడుతు..కుటుంబంలోని మిగతా వారి కంటే ఠాగూర్ నల్లగా ఉండేవారు.. ఇక్కడ రెండు రకాల రంగున్న వ్యక్తులు ఉన్నారు.. పసుపు రంగులో మెరిసిపోయేవారు కొందరుంటే..ఇంకొందరు ముదురు రంగులో ఉండేవారు.. విశ్వకవి రెండో వర్గానికి చెందినవారు. అని అన్నారు. విశ్వకవిగా పేరొందిని రవీంద్రుడు కుటుంబంలోనే వివక్షను ఎదుర్కొన్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పలువురు మేధావులు, విద్యావేత్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. అటు రాజకీయంగానూ మంత్రిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యా శాఖ మంత్రి అజ్ఞ‌ానానికి ఇది నిదర్శనమని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. భారతీ సాహిత్యానికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిన రవీంద్రుడి రంగుపై ఇటువంటి వ్యాఖ్యలు విద్యాశాఖామంత్రి బాధ్యతల్లో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయటంపై మండిపడుతున్నారు.

మంత్రిగారి వ్యాఖ్యలపై విశ్వభారతి వైస్-ఛాన్సలర్ పవిత్రా సర్కార్ మాట్లాడుతు..‘గౌరవనీయులైన మంత్రిగారు ఏ ప్రాతిపదికన ఈ వ్యాఖ్యలు చేశారో నాకు తెలియదు.. ఆయన ఠాగూర్ సరిగ్గా అర్థం చేసుకున్నారో లేదో తెలియదు..విశ్వకవి పెద్ద సోదరి ఆయనను ‘మా ముదురు రంగు అబ్బాయి రబీ’ అని వర్ణించారు. ఇది కేవలం అతిశయోక్తి మాత్రమే. అంతేగానీ, రవీంద్రనాథ్ ఆఫ్రికన్ల మాదిరిగా నల్లగా ఉంటారని చెప్పడం మంత్రి ఉద్దేశమా? లేదా చీకటి మధ్య ఉండే ఛాయలా ఉన్నారని చెప్పాలనుకున్నారా?’ అని వీసీ పవిత్రా సర్కార్ అన్నారు.

అటు మంత్రి వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్ ఐకాన్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని మండిపడింది. మంత్రి సుభాష్ సర్కార్‌కు రవీంద్రనాథ్ ఠాగూర్ చరిత్ర తెలియదు.. విశ్వకవి అందమైన మేనిఛాయ ఉన్నవారని అందరికీ తెలుసు.. ఇది జాత్యహంకార వ్యాఖ్యలు, బెంగాల్ చిహ్నాలను అవమానించడం.. సుభాస్ సర్కార్‌ను విశ్వభారతిలోకి ఎప్పటికీ అనుమతించకూడదు’ అని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించారు.

మంత్రి వ్యాఖ్యలపై సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు సుజన్ చక్రవర్తి మాట్లాడుతూ..మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీ జాత్యహంకారానికి నిదర్శనమని అన్నారు. బెంగాలీ వ్యతిరేక మనస్తత్వానికి ఇవి నిదర్శనమన్నారు. మంత్రి వ్యాఖ్యలపై వర్శిటీ విద్యార్ధులు కూడా మండిపడ్డారు.భారతదేశ సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చినవారిలో అగ్రగణ్యులు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. సాహిత్యంలో నోబెల్ అందుకున్న తొలి ఆసియాగా గుర్తింపు పొందిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.