ఆరుగురిని ఢీకొన్న పెళ్లికారు..పోలీసుల నిఘాలో రెండు ‘నిఖా’లు

ఆరుగురిని ఢీకొన్న పెళ్లికారు..పోలీసుల నిఘాలో రెండు ‘నిఖా’లు

UP : car in marriage procession hits 6 people In mothipur : శుభమా అంటూ పెళ్లి చేసుకోవటానికి వెళ్లి పెళ్లివారి కారు ఆరుగురిని ఢీకొంది. రంగంలోకి దిగిన పోలీసులు సదరు పెళ్లివారి కూడా వెళ్లి దగ్గరుండి మరీ పెళ్లి జరిపించారు. దీంతో సందడి సందడిగా జరగాల్సిన వివాహ వేడుక కాస్తా ఆందోళన మధ్య జరగాల్సి వచ్చింది.

ఉత్తర ప్రదేశ్‌లోని మోతిపూర్ పోలీస్టేషన్ పరిధిలో ఆదివారం (డిసెంబర్ 17,2020)సాయంత్రం ఖైరి సమోస గ్రామానికి చెందిన ఓ కుటుంబం తమ ఇద్దరి కుమార్తెలకు ఒకేసారి ‘‘నిఖా’’ జరిపించింది. పెళ్లి వేడుకల కోసం ఆరు వాహనాలు ఏర్పాటు చేశారు. పెళ్లివారంతా కాన్వాయ్ ముందు డ్యాన్స్ చేస్తూ వెళ్తున్నారు. ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తున్నారు.

అదే సమయంలో పెళ్లివారి కారుల్లో ఉన్న ఓ ఎస్‌యూవీ కారు హఠాత్తుగా వేగం పెంచుకుని బీభత్సం సృష్టించింది. ఈ బీభత్సంలో పెళ్లికి ఆరుగురు స్థానికులు గాయపడ్డారు. వీరంతా పెళ్లివారికి సంబంధంలేదనివారే కావటంతో అదికాస్తా పోలీసుల దాకా వెళ్లింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు మిగతా ఐదు వాహనాల అద్దాలు పగలగొట్టి పెళ్లి వారితో ఘర్షణకు దిగారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికులకు పెళ్లివారికి మధ్య సమోధ్యకుదిర్చారు. ఘర్షణ వాతావారణాన్ని సద్దుమణిగేలా చేసి..ముందు జాగ్రత్తగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి పెళ్లి తంతు అంతా దగ్గరుండి జరిపించారు.

దీనిపై అదనపు ఎస్పీ (రూరల్) అశోక్ కుమార్ మాట్లాడుతూ..పెళ్లికారు డ్రైవర్ గా ఉన్న వ్యక్తి స్థానికుల ఆగ్రహానికి భయపడి ఎస్‌యూవీ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన స్థానికులను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామనీ..వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెహ్రయిచ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించామని అశోక్ కుమార్ వెల్లడించారు.