కూతురు తల నరికి, చేత్తో పట్టుకుని…వీధుల్లో తిరుగుతున్న తండ్రి..

కూతురు తల నరికి, చేత్తో పట్టుకుని…వీధుల్లో తిరుగుతున్న తండ్రి..

UP man Chops his Daughters Head : కన్నతండ్రే కూతురుపాలిట కసాయివాడయ్యాడు. కసాయివాడు మేక తల నరకినట్లుగా కూతురు తలను నరికేశాడా తండ్రి. ఆతరువాత ఆ తల పట్టుకుని వీధులమ్మటా తిరిగాడు. అది చూసిన స్థానికులు హడలిపోయారు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ దారుణ ఘటన యూపీలోని పండితారాలో జరిగింది. కూతురుమీద అనుమానంతో కన్నతండ్నే ఈ ఘాతుకానికి పాల్పడటం స్థానికులనే కాకుండా ఆ చుట్టు పక్కల గ్రామాలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసింది.

యూపీలోని హర్దోయి జిల్లా..లక్నోకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండితారా గ్రామానికి చెందిన సర్వేశ్ కుమార్ అనే వ్యక్తి, నరికేసిన ఓ తలను చేత్తో పట్టుకుని నడుస్తుండగా గ్రామస్థులు గమనించారు. దగ్గరకు వెళ్లి చూడగా అది అతని 17 ఏళ్ల కూతురు తల గుర్తించి షాక్ అయ్యారు. అనంతరం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సర్వేశ్ నడుస్తున్న దారికి ఎదురొచ్చి, అడ్డగించారు. వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు..సదరు తండ్రికి జరిగిన సంభాషణాను వీడియో కూడా తీశారు.

పోలీసులు అతని పేరు అడగారు. తరువాత నరికిన ఆ తల ఎవరిదని ప్రశ్నించగా..అతను ఏమాత్రం భయపడకుండా..‘‘ఇది తన కూతురి తలే..పదునైన కత్తితో నేనే నరికేసా..ఈ హత్యతో ఇంకెవ్వరికీ సంబంధం లేదు..అంటూ నిర్భయంగా చెప్పాడు.

ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని..నా పరువు తీసేసిందనీ..అది భరించలేక నేనే ఈ హత్య చేశానని చెప్పాడు. ఆ తరువాత పోలీసులు నరికిన తల కిందపెట్టి..నేలమీద మోకాళ్లమీద కూర్చోవాలని ఆదేశించగా ఏమాత్రం కాదనకుండా పోలీసులు చెప్పినట్లే చేశాడు. నా కూతురు తల నా దగ్గరే ఉంది మిగతా శరీరం ఇంట్లోనే ఉంది..కావాలంటే వెళ్లి చూడండీ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తరువాత అతన్ని అరెస్ట్ చేసి, స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

కాగా..ఆడవారిపై జరిగే నేరాల్లో దేశంలోనే ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 2019 లో మహిళలపై నేరాల లిస్టులో ఉత్తర ప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని గత 2020 సెప్టెంబర్‌లో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. పోక్సో చట్టం ప్రకారం 7,444 కేసులతో ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా ఆడపిల్లలపై నేరాలు నమోదయ్యాయి.