వ్యాక్సిన్కు భయపడకండి అంటున్న ఉపాసన..
Upasana: కరోనా రక్కసి నుండి కాపాడుకోవడం కోసం ఇటీవలే వ్యాక్సిన్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ విషయంలో ఇప్పటికే పలువురు ముందుకొచ్చి దైర్యంగా వ్యాక్సిన్ వేయించుకుంటే మరికొందరు ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తాను వ్యాక్సిన్ వేయించు కోవడమే కాకుండా, తన హాస్పిటల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ను కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఈ వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని, అప్పుడే కరోనా మహమ్మారినుండి బయట పడతామని ఆమె అన్నారు.