‘ఉప్పెన’ సక్సెస్ సెలబ్రేషన్స్..
Uppena Team: పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానాను దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేస్తూ సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ‘ఉప్పెన’.. ఫిబ్రవరి 12న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మార్నింగ్ షో నుండే మంచి టాక్ తెచ్చుకుంది. హీరో హీరోయిన్ల నటన, విజయ్ సేతుపతి విలనిజం, దేవి శ్రీ ప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని దర్శకుడు ఎమోషనల్గా తెరకెక్కించాడంటూ ప్రశంసిస్తున్నారు.
మౌత్ టాక్తో సినిమా స్థాయి మరింత పెరిగింది. ఇది రూ. 100 కోట్ల సినిమా అవుతుందని సుకుమార్ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. మైత్రీ సంస్థ కార్యాలయం వద్ద టపాసులు కాల్చి ‘ఉప్పెన’ విజయోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు మూమీ టీమ్.