Viral Video: 9 మంది పిల్లలను కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన వ్యక్తి

ఓ వ్యక్తి తొమ్మిది మంది పిల్లలను ఒకే సైకిల్ పై ఎక్కించుకుని తొక్కుకుంటూ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జైకీ యాదవ్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ‘‘ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. ఈ విజయాన్ని సాధించడానికి ఇటువంటి వారు ఎంతో సహకారం అందించారు’’ అని సెటైర్ వేశాడు.

Viral Video: 9 మంది పిల్లలను కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన వ్యక్తి

Viral Video: ఓ వ్యక్తి తొమ్మిది మంది పిల్లలను ఒకే సైకిల్ పై ఎక్కించుకుని తొక్కుకుంటూ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జైకీ యాదవ్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ‘‘ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. ఈ విజయాన్ని సాధించడానికి ఇటువంటి వారు ఎంతో సహకారం అందించారు’’ అని సెటైర్ వేశాడు.

ఈ సైకిల్ పై ముగ్గురు ముందు కూర్చోగా, మరో ముగ్గురు వెనుక కూర్చున్నారు. మిగిలిన ముగ్గురు చిన్నారులు సైకిల్ తొక్కుతున్న వ్యక్తిని చేతులు, వీపుపై కూర్చున్నారు. పట్టుతప్పి జారిపడితే పరిస్థితి ఏంటని నెటిజన్లు ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ జనాభా ఇటువంటి వ్యక్తి వల్లే పెరిగిపోతోందని కొందరు కామెంట్లు చేశారు.

అయితే, ఆ చిన్నారులు ఆ వ్యక్తి సొంత పిల్లలు కాకపోవచ్చని మరికొందరు అంటున్నారు. వారికి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఇలా సైకిల్ పై వెళ్లాల్సి వస్తుందేమోనని కొందరు కామెంట్లు చేశారు. పుస్తకం కవరుని చూసి పుస్తకంలో సాహిత్యాన్ని నిర్ధారించకూడదని కొందరు నీతి వ్యాఖ్యలు చేశారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..