వైఎస్ జగన్, మంచు విష్ణు ఫ్యామిలీ మీటింగ్..
Vishnu Manchu: ఈ రోజు విజయవాడ తాడేపల్లిలోని సీఏం నివాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వారి సతీమణి వైఎస్ భారతిని విష్ణు మంచు, విరానికా మంచు దంపతులు కలిశారు.
బంధువులైన ఇరు కుటుంబాల వారు అందరూ కలిసి సీఏం నివాసంలో లంచ్ చేశారు.. జగన్, విష్ణు, మనోజ్, లక్ష్మీ మంచు మరియు మోహన్ బాబు సినిమా విశేషాలు అడిగి తెలుసుకున్నారు. జగన్, విష్ణు ఫ్యామిలీ కలిసి తీసుకున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా మోహన్ బాబు ప్రధాన పాత్రలో మంచు విష్ణు నిర్మిస్తున్న ‘సన్నాఫ్ ఇండియా’ ఫస్ట్ లుక్ నేడు విడుదలైంది. విష్ణు నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘మోసగాళ్లు’ రిలీజ్కి రెడీ అవుతోంది. మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మంచు లక్ష్మీ నటించిన ‘పిట్టకథలు’ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది.