Vishnu Vishal : తమిళ్ వాళ్ళు అలా మాట్లాడారు.. కానీ రవితేజ అయితే.. టాలీవుడ్ ని పొగిడిన తమిళ్ హీరో..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు విశాల్ మాట్లాడుతూ తమిళ పరిశ్రమ గురించి, తెలుగు పరిశ్రమ గురించి వ్యాఖ్యలు చేశాడు...........

Vishnu Vishal : తమిళ్ వాళ్ళు అలా మాట్లాడారు.. కానీ రవితేజ అయితే.. టాలీవుడ్ ని పొగిడిన తమిళ్ హీరో..

Vishnu Vishal comments on telugu, tamil industries

Vishnu Vishal :  తమిళ్ హీరో విష్ణు విశాల్ ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరవుతున్నారు. కొన్ని రోజుల క్రితం తన FIR సినిమాని తెలుగులో రిలీజ్ చేశాడు. తాజాగా మట్టి కుస్తీ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాని రవితేజ, విష్ణు విశాల్ కలిసి నిర్మించారు. మట్టి కుస్తీ సినిమా తెలుగు, తమిళ్ లో డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు విశాల్ మాట్లాడుతూ తమిళ పరిశ్రమ గురించి, తెలుగు పరిశ్రమ గురించి వ్యాఖ్యలు చేశాడు. విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ”FIR సినిమాని తెలుగులో రిలీజ్ చేద్దామనుకునే సమయంలో ఒక ఫ్రెండ్ ద్వారా రవితేజ గారిని కలిశాను. నేను చేసే సినిమాలు తనకి నచ్చుతాయని రవితేజ చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను. FIR సినిమా గురించి చెప్పి ట్రైలర్ చూపించాను. దాంతో ఆ సినిమాని తెలుగులో తాను రిలీజ్ చేస్తా అన్నారు. ఆ వెంటనే తర్వాత ప్రాజెక్టుల గురించి అడిగితే ఈ మట్టి కుస్తీ సినిమా గురించి చెప్పి, లైన్ చెప్పాను. లైన్ బాగుంది, హిట్ అవుతుంది అని చెప్పి ఆయనే ప్రొడ్యూస్ చేస్తా అన్నారు.

BiggBoss 6 Day 83 : కంటెస్టెంట్స్ కోసం వచ్చిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్..

”ఆ మాట విని నేను షాక్ అయ్యాను. 13 ఏళ్లుగా నేను తమిళ ఇండస్ట్రీలో ఉన్నాను. నిర్మాతల కోసం చాలా మంది దగ్గరికి తిరిగిన రోజులు ఉన్నాయి. ఏదైనా ఒక సినిమా కోసం నిర్మాత దగ్గరికి వెళ్తే నా బిజినెస్, మార్కెట్, ఎంత వస్తుంది.. అని ఇలా లెక్కలు మాట్లాడేవాళ్ళు. కానీ రవితేజ గారు నా ట్యాలెంటు చూసి నాకు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. టాలీవుడ్ లో మంచి సినిమాలని ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమా కచ్చితంగా ఆడుతుంది. రవితేజ గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెడతాను. నా మనసులో రవితేజ గారికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన వల్లే తెలుగులో కూడా నా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి” అని తెలిపారు.