వోల్వో కార్స్ మేనేజిండ్ డైరెక్టర్‌గా జ్యోతి మల్హోత్రా

వోల్వో కార్స్ మేనేజిండ్ డైరెక్టర్‌గా జ్యోతి మల్హోత్రా

ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్లు ఇండియాలో తన సంస్థ కార్యకలాపాలకు సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్‌గా జ్యోతి మల్హోత్రాను నియమించింది. ఈ నిర్ణయం మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుండగా.. జ్యోతి మల్హోత్రాను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించినట్లు వోల్వో కార్స్ ఇండియా శనివారం ప్రకటించింది.

49 ఏళ్ల మల్హోత్రా భారతదేశంలో కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా అయిన మొదటి భారతీయుడు. ప్రస్తుతం మల్హోత్రా డైరెక్టర్ ఆఫ్.. సేల్స్ అండ్ మార్కెటింగ్‌గా పనిచేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 2016లో మల్హోత్రా కంపెనీలో చేరారు.

మల్హోత్రా… అంతకుముందు మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, ఫియట్‌ ఇండియా వంటి ప్రముఖ వాహన తయారీ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. వాహనరంగంలో ఆయనకు 24 సంవత్సరాల అనుభవం ఉంది.