Delhiకి భారీ భూకంప ముప్పు..శాస్త్రవేత్తలు హెచ్చరిక

  • Published By: madhu ,Published On : June 20, 2020 / 08:04 AM IST
Delhiకి భారీ భూకంప ముప్పు..శాస్త్రవేత్తలు హెచ్చరిక

దేశ రాజధానికి భారీ భూంకంపం ముప్పు పొంచి ఉందా ? అసలే కరోనాతో ముప్పుతిప్పలు పడుతుంటే..మరలా ఇదేంది..అనుకుంటున్నారా ? కానీ గత కొద్ది రోజులుగా ఢిల్లీలో భూ ప్రకంపనాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

గత మే 29వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ..పరిసర ప్రాంతాల్లో 14 సార్లు భూమి కంపించింది. దీంతో శాస్త్రవేత్తలు దీనిపై స్టడీ చేశారు. భారతదేశంలో తర్వలోనే భూకంపం వచ్చే సూచనలున్నాయని హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ శాస్త్రవేత్తలు చేసిన హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. 

ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని జియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని ఢిల్లీ – షార్దోఢా, మహేంద్రగఢ్ – డెహ్రాడూన్, ఢిల్లీ – హరిద్వార్ కొండ ప్రాంతం, మొరదాబాద్, గ్రేట్ బౌండ్రీ, సోహ్నా, గంగానది యమున, ప్రవాహ ప్రాంతాలు బలహీనమైన జోన్లుగా గుర్తించారు.

హిమాలయ అడుగు భాగంలో ఉన్న ఇండియన్ ప్లేట్, యూరేషియన్ ప్లేట్ తో ఢీకొనడం వల్ల పీడన శక్తి కేంద్రీకృతమవుతోందని అంచనా వేశారు. ఆ శక్తి బలహీనమైన జోన్ల ద్వారా విడుదల కావడం వల్ల అక్కడి రాతి పొరల్లో ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మార్గదర్శకాలను అనుసరించి భూగర్భలోపాలున్నచోట నిర్మాణాలు చేపట్టకపోవడం మంచిదంటున్నారు.

చిన్న పాటి ప్రకంపనలతో భూమి కంపించవచ్చని, లేదా..ఒకేసారి పెద్ద ప్రకంపనాలు వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఢిల్లీ – ఎన్సీఆర్ లో జరిగిన 14 భూ ప్రకంపనాల్లో మే 29వ తేదీన వచ్చిన భూకంపం 4.6 తీవ్రతతో కూడుకుందని, ముందే ఊహించలేమన్నారు. 

1720 సంవత్సరంలో ఢిల్లీలో 6.5 తీవ్రత, 1803లో మధుర వద్ద 6.8 తీవ్రత, 1842లో మధుర సమీపంలో 5.5 తీవ్రత, 1956లో బులంద్ షహర్ సమీపంలో 6.7 తీవ్రత, 1960లో ఫరీదాబాద్ సమీపంలో 6.0 తీవ్రత, 1966 మొరదాబాద్ లో 5.8 తీవ్రత రిక్టర్ స్కేల్ పై నమోదైందనే విషయాన్ని గుర్తు చేశారు. భారీ భూకంపం వల్ల ప్రజలకు, ఆస్తులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. 

Read: ఆన్‌లైన్‌లో ఆల్కహాల్.. డోర్ డెలివరీ.. ప్రభుత్వం అనుమతులు