Viral Video: హార్దిక్ పాండ్యా, కానె విలియమ్సన్ కలిసి ‘క్రొకొడైల్ బైక్’పై చక్కర్లు

టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా, న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కానె విలియమ్సన్ ‘క్రొకొడైల్ బైక్’పై చక్కర్లు కొట్టారు. ఎల్లుండి నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఇప్పటికే న్యూజిలాండ్ చేరుకుంది. వెల్లింగ్టన్ లోని స్కై స్టేడియంలో మొదటి మ్యాచ్ జరగనుంది. దీంతో ఇరు దేశాల కెప్టెన్లు పాండ్యా, విలియమ్సన్ ట్రోఫీని ఆవిష్కరించారు. ‘క్రొకొడైల్ బైక్’పై ప్రయాణించారు.

Viral Video: హార్దిక్ పాండ్యా, కానె విలియమ్సన్ కలిసి ‘క్రొకొడైల్ బైక్’పై చక్కర్లు

Viral Video: టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా, న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కానె విలియమ్సన్ ‘క్రొకొడైల్ బైక్’పై చక్కర్లు కొట్టారు. ఎల్లుండి నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఇప్పటికే న్యూజిలాండ్ చేరుకుంది. వెల్లింగ్టన్ లోని స్కై స్టేడియంలో మొదటి మ్యాచ్ జరగనుంది. దీంతో ఇరు దేశాల కెప్టెన్లు పాండ్యా, విలియమ్సన్ ట్రోఫీని ఆవిష్కరించారు. ‘క్రొకొడైల్ బైక్’పై ప్రయాణించారు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, రోహిత్ శర్మ న్యూజిలాండ్ పర్యటకు వెళ్లకుండా అతడికి విశ్రాంతి ఇచ్చారు. అలాగే, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ కూడా న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉంటున్నారు. సీనియర్లు మ్యాచుకు దూరం అవుతుండడంతో కొత్త వారిని ఇది మంచి అవకాశమని, తమను తాము నిరూపించుకోవాలని హార్దిక్ పాండ్యా అన్నాడు.

చాలా మంది ముఖ్యమైన ఆటగాళ్లు న్యూజిలాండ్ తో సిరీస్ కు దూరమయ్యారని గుర్తు చేశాడు. కాగా, టీ20 ప్రపంచ కప్ లో సెమీఫైనల్ వరకు వెళ్లి భారత్, న్యూజిలాండ్ అందులో ఓడిపోయిన విషయం తెలిసిందే. గ్రూప్-ఏలో న్యూజిలాండ్, గ్రూప్-బీలో భారత్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ రెండో స్థానంలో నిలిచిన పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లతో పరాజయం పాలయ్యాయి.

 

View this post on Instagram

 

A post shared by BLACKCAPS (@blackcapsnz)

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..