T20 World Cup-2022: సెమీఫైనల్ మ్యాచ్ కోసం అడిలైడ్ ఓవల్ చేరుకున్న టీమిండియా.. వీడియో

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా ఈ నెల 10న అడిలైడ్ ఓవల్ మైదానంలో సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో అడిలైడ్ ఓవల్ కు భారత జట్టు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. టీమిండియా సెమీఫైనల్ లో ఇంగ్లండ్ తో తలబడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాక్టీసు మొదలు పెట్టనుంది.

T20 World Cup-2022: సెమీఫైనల్ మ్యాచ్ కోసం అడిలైడ్ ఓవల్ చేరుకున్న టీమిండియా.. వీడియో

T20 World Cup-2022: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా ఈ నెల 10న అడిలైడ్ ఓవల్ మైదానంలో సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో అడిలైడ్ ఓవల్ కు భారత జట్టు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. టీమిండియా సెమీఫైనల్ లో ఇంగ్లండ్ తో తలబడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాక్టీసు మొదలు పెట్టనుంది.

టీ20 ప్రపంచ కప్ లో ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో భారత జట్టు గెలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో ఓడిపోయింది. దీంతో టీమిండియాకు గ్రూప్-బీలో 8 పాయింట్లు ఉన్నాయి. ఆ తర్వాత 6 పాయింట్లతో పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. టీమిండియా 2007లో టీ20 ప్రపంచ కప్ (టీ20 ఫార్మాట్ లో నిర్వహించిన తొలి ప్రపంచ కప్) గెలుచుకుంది.

మళ్ళీ ఇప్పటివరకు టీమిండియా టీ20 ప్రపంచ కప్పును గెలుచుకోలేదు. ఈ సారి భారత జట్టు మంచి జోరు మీద ఉండడంతో ప్రపంచ కప్ పై టీమిండియా అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. టీమిండియా టీ20 ప్రపంచ కప్ సాధించి 15 ఏళ్లు అవుతుండడంతో ఈ సారైనా కప్పుతోనే తిరిగి రావాలని కోరుకుంటున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..