Kishan Reddy: ఇక నుంచి తెలంగాణ సర్కారుకి వ్యతిరేకంగా, కసిగా పనిచేస్తాం: కిషన్ రెడ్డి

ఇక నుంచి తెలంగాణ సర్కారుకి వ్యతిరేకంగా, కసిగా పనిచేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. అసలైన ఆట ఇప్పుడే మొదలైందని చెప్పారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలో నైతిక విజయం తమదేనని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ ప్రలోభాలకు పాల్పడిందని, అంతేగాక బెదిరింపులకు దిగిందని ఆరోపించారు. ఈ కారణాల వల్లే టీఆర్ఎస్ గెలిచిందని అన్నారు.

Kishan Reddy: ఇక నుంచి తెలంగాణ సర్కారుకి వ్యతిరేకంగా, కసిగా పనిచేస్తాం: కిషన్ రెడ్డి

Kishan Reddy: ఇక నుంచి తెలంగాణ సర్కారుకి వ్యతిరేకంగా, కసిగా పనిచేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. అసలైన ఆట ఇప్పుడే మొదలైందని చెప్పారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలో నైతిక విజయం తమదేనని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ ప్రలోభాలకు పాల్పడిందని, అంతేగాక బెదిరింపులకు దిగిందని ఆరోపించారు. ఈ కారణాల వల్లే టీఆర్ఎస్ గెలిచిందని అన్నారు.

మునుగోడులో తమకు గతంలో డిపాజిట్ రాని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి రెండో స్థానానికి వచ్చామని చెప్పారు. కేసీఆర్ కుటుంబానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు రానున్నాయని అన్నారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ను గద్దె దించుతామని చెప్పారు.

కాగా, నిన్న వెల్లడైన మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10 వేల ఓట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రధాన పార్టీలు తదుపరి అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..