West Bengal : ఇద్దరు మంత్రుల అరెస్టు, సీబీఐ ఆఫీసుకు మమత

ఇద్దరు మంత్రుల అరెస్టు, సీబీఐ ఆఫీసుకు మమత

West Bengal : ఇద్దరు మంత్రుల అరెస్టు, సీబీఐ ఆఫీసుకు మమత

Cbi

Two Ministers Arrested : వెస్ట్ బెంగాల్ లో అధికారంలోకి వచ్చాక తొలిసారి మమత బెనర్జీకి షాక్ తగిలింది. ఇద్దరు మంత్రులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. నారద స్టింగ్‌ ఆపరేషన్‌లో భాగంగా..2021, మే 17వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మంత్రి ఫిర్మాద్‌ హకీమ్‌ ఇంటికి కేంద్ర బలగాలు వెళ్లాయి. అతడిని అదుపులోకి తీసుకున్నాయి.

మరో మంత్రి సుబ్రతా ముఖర్జీని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వెంటనే సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారామె. తనను కూడా అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు…తృణమూల్‌ ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మేయర్‌ సోవన్‌ ఛటర్జీ నివాసాలకు కూడా కేంద్ర బలగాలు చేరుకున్నాయి.

2016 కేసు : –
2016 ఎన్నికల సమయంలో నారద న్యూస్‌ స్టింగ్ ఆపరేషన్ చేపట్టంది. కెమెరా ముందు పలువురు డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ వ్యాపారవేత్త నుంచి నలుగురు ఎంపీలు, నలుగు మంత్రులు, ఓ ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంటున్నట్లు వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం ప్రారంభించింది. స్టింగ్‌ ఆపరేషన్‌లో విచారణ చేయాలని ఇటీవలే బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. స్పెషల్‌ కోర్టులో చార్జ్‌షీట్‌ సీబీఐ దాఖలు చేసింది. మొత్తం నలుగురిని అరెస్ట్‌ చేయడం బెంగాల్‌లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

Read More :  Silence Autoplay Videos: ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఆటోప్లే వీడియోలను Mute చేయాలంటే?