క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మే 22 నుంచి లీగ్‌ ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. దీంతో కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా

  • Published By: naveen ,Published On : May 14, 2020 / 12:20 PM IST
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మే 22 నుంచి లీగ్‌ ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. దీంతో కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. దీంతో కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల క్రీడా ఈవెంట్లు రద్దయ్యాయి. ఇక ఈ సీజన్ ఐపీఎల్ కూడా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో క్రికెట్ లవర్స్ బాగా డీలా పడ్డారు. సమ్మర్ లో మంచి ఎంజాయ్ మెంట్ మిస్ అయ్యిందని ఫీల్ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో క్రికెట్ అభిమానులకు ఓ గుడ్ నూస్. త్వరలో క్రికెట్ లీగ్ ఒకటి ప్రారంభం కానుంది.

6 జట్లు.. 30 మ్యాచ్ లు:
ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం కొనసాగుతుండగా ఓ వైపు వెస్టిండీస్‌ లో క్రికెట్ జోరు మొదలైంది. విన్సీ ప్రీమియర్‌ లీగ్‌(వీపీఎల్‌)లో భాగంగా టి-10 లీగ్ ను ప్రారంభించడానికి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు షెడ్యూల్ ఖరారు చేసింది. తూర్పు కరీబియన్‌ దీవుల్లో నిర్వహించ తలపెట్టిన ఈ టోర్నీతో వెస్టిండీస్‌ లో మళ్లీ క్రికెట్ కళ తీసుకురావాలని యోచిస్తోంది. మే 22 నుండి మే 30 వరకు ఈ లీగ్ జరుగుతుంది. మొత్తం ఆరు జట్లు పాల్గొనే ఈ లీగ్ లో మొత్తం 30 మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఇందులో అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా పాల్గొంటారని.. మొత్తం 72 మంది ఆటగాళ్లు పాల్గొంటారని విండీస్ తెలిపింది.

కరోనా సంక్షోభంలో తొలి క్రికెట్ టోర్నీ:
ఇక కరోనా సంక్షోభంలో ఐసీసీలో సభ్యత్వం కలిగిన ఒక దేశం నిర్వహిస్తున్న తొలి క్రికెట్ టోర్నీ ఇదే కావడం విశేషం. ఇది టీ 10 క్రికెట్ పొట్టి పార్మెట్ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఇది ఎంతో అలరిస్తుందని.. వీటిని ప్రత్యక్ష ప్రచారం చేస్తున్నామని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కిషోర్‌ షా లో తెలిపారు. కాగా ఆటగాళ్లు భౌతిక దూరం పాటిస్తూనే బరిలోకి దిగబోతున్నారని.. గ్యాలరీల్లో ప్రేక్షకులు ఎవరు ఉండరు కాబట్టి ఆటగాళ్లు భౌతికదూరం పాటించడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయన చెప్పారు. కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బంతిపై సలైవాను రుద్దడాన్ని నిషేధించినట్లు ఆయన తెలిపారు.

Read Here>> ధావన్ ఒక ఇడియట్.. ఫస్ట్ బాల్ ఆడడు: రోహిత్ శర్మ