108 Ambulance : మొరాయించిన 108 అంబులెన్స్-మహిళ మృతి

ప్రాణాలు కాపాడాల్సిన 108 అంబులెన్స్ కారణంగా  ఒక మహిళ ప్రాణాలు  కోల్పోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. 

108 Ambulance : మొరాయించిన 108 అంబులెన్స్-మహిళ మృతి

108 Ambulence In Khammam

108 Ambulance :  ప్రాణాలు కాపాడాల్సిన 108 అంబులెన్స్ కారణంగా  ఒక మహిళ ప్రాణాలు  కోల్పోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.  జిల్లాలోని చర్ల మండలం రాళ్ళాపురానికి చెందిన గుత్తికోయ మహిళ మాడవి చుకిడీ(25) కుటుంబ సమస్యలతో గురువారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు చూసి ఆమెను ఆస్పత్రిలో చేర్చేందుకు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు.  చర్లకు చెందిన 108 అంబులెన్స్ చుకిడీని తీసుకుని ఆస్పత్రికి వస్తుండగా… మార్గం  మధ్యలో తాలిపేరు ప్రాజెక్ట్ శివారులో మొరాయించింది.  డ్రైవర్ ఎంత ప్రయత్నించినా అంబులెన్స్ తిరిగి స్టార్ట్ కాలేదు.

దీంతో చుకిడీని గ్రామస్ధులు ద్విచక్ర వాహానం పైన ఎక్కించుకుని చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కొంతకాలంగా 108 వాహానం సరిగా పని చేయటం లేదని చెపుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు.

Also Read :  Karnataka : ప్రియుడితో భార్య పారిపోయిందని పిల్లల్ని చంపిన భర్త