Rajnath Singh: అవసరమైతే సరిహద్దులు దాటుతాం: రాజ్‌నాథ్ సింగ్

దేశంలో తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని, తీవ్రవాదాన్ని అంతం చేసే పోరులో దేశం వెనుకుంజ వేయబోదన్నారు కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్.

Rajnath Singh: అవసరమైతే సరిహద్దులు దాటుతాం: రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh

Rajnath Singh: దేశంలో తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని, తీవ్రవాదాన్ని అంతం చేసే పోరులో దేశం వెనుకుంజ వేయబోదన్నారు కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్. అసోంలోని గువహటిలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. పొరుగు దేశం తీవ్రవాదాన్ని భారత్‌లోకి పంపాలనుకుంటే సరిహద్దులు దాటేందుకు కూడా వెనుకాడబోం అని పరోక్షంగా పాక్‌ను హెచ్చరించారు. ‘‘పొరుగు దేశాల్లో బంగ్లాదేశ్ మిత్రదేశంగా ఉంటోంది. అటువైపు నుంచి ఎలాంటి చొరబాట్లు లేవు.

Rajnath Singh: సాయుధ బలగాల్లో మహిళలకు అధిక భాగస్వామ్యం కల్పిస్తాం: రాజ్ నాథ్ సింగ్

అటువైపు సరిహద్దు శాంతియుతంగా ఉంది. సమస్యంతా పశ్చిమ దిక్కు ఉన్న దేశాలతోనే. సరిహద్దులో మన సైనికులు ఎలాంటి పని చేస్తున్నారో బహిరంగంగా చెప్పలేను. కానీ, భారత దేశానికి ఎలాంటి హాని తలపెట్టినా వదిలిపెట్టబోం’’ అంటూ చైనాను కూడా హెచ్చరించారు. ఇప్పటికే ప్రపంచ పటంలో భారత ముఖ చిత్రం మారిపోయిందని, భవిష్యత్తులో ఏ శక్తీ దేశాన్ని అడ్డుకోలేదన్నారు రాజ్‌నాథ్ సింగ్. ప్రస్తుతం అమల్లో ఉన్న త్రివిధ దళాలకు చెందిన ‘ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్’ను త్వరలో తొలగిస్తామని చెప్పారు. ఇప్పటికే మణిపూర్, నాగాలాండ్‌కు చెందిన 15 పోలీస్ స్టేషన్లలో ఈ చట్టాన్ని రద్దు చేసినట్లు చెప్పారు.