కూత పెట్టి బరిలోకి.. కబడ్డీ ఆడిన రోజా!

కూత పెట్టి బరిలోకి.. కబడ్డీ ఆడిన రోజా!

ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడి వార్తల్లో నిలిచే నగరి ఎమ్మెల్యే, సినీనటి ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా.. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల వేళ.. ప్రచారంలో బిజీగా తిరుగుతున్నారు.

నగరి నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకెళ్తున్న ఎమ్మెల్యే రోజా.. నగరితో పాటు పుత్తూరు మున్సిపాలిటీలో స్థానిక నేతలతో కలిసి ఆమె వీధి వీధి తిరుగుతున్నారు. వైసీపీకే ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ సంధర్భంగా.. చిత్తూరు జిల్లా నిండ్రలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కబడ్డీ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఆమె.. అక్కడి క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ.. కబడ్డీ కోర్టులో కూతకు దిగారు.

తనకూ కబడ్డీ అంటే ఇష్టమని.. అందుకే క్రీడాకారులతో కాసేపు ఆడినట్లు ఆమె చెప్పుకొచ్చారు. తిరువేలంగాడు, రేణిగుంట జట్ల మధ్య జరిగిన రసవత్తర పోటీల్లో మొదట రేణిగుంట టీం వైపు ఆడగా.. మరోసారి తిరువేలంగాడు జట్టు తరపున కబడ్డీ ఆడారు ఎమ్మెల్యే రోజా.