ఖమ్మం నుంచే.. నేను ఎవరో వదిలిన బాణం కాదు -షర్మిల

ఖమ్మం నుంచే.. నేను ఎవరో వదిలిన బాణం కాదు -షర్మిల

Ys Sharmila New Party In Telangana From April 211

ys sharmila:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ చెల్లెలు షర్మిల.. తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. నిత్యం రాజకీయ నేతలు, మాజీ అధికారులు, పలు సంఘాల నేతలు, అభిమానులతో సమావేశమవుతున్న షర్మిల..మంగళవారం ఖమ్మం జిల్లా ముఖ్యనేతలు, అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఏప్రిల్‌ 9న ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.

ఈ సమయంలోనే రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల ఎప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో పార్టీ ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు షర్మిల. ఖమ్మం వేదికగానే సరమశంఖం పూరిద్దామని అన్నారు. లక్ష మంది సమక్షంలో పార్టీని ప్రకటిద్దాం అన్నారు. పార్టీ ఏర్పాటు, విధి విధానాలపై ఖమ్మం నేతలకు వివరణ ఇచ్చారు.

ఇదే సమయంలో తెలంగాణలో సమస్యల పరిష్కారం కోసమే రాజకీయ పార్టీ స్థాపిస్తున్నట్లు వెల్లడించిన షర్మిల.. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేయాలని ఖమ్మం జిల్లా నేతలు, అభిమానులు కోరుతున్నా. దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు కానీ.. ఈ సందర్భంగా..తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు షర్మిల. తాను ఎవరో వదిలిన బాణం కాదని అన్నారు. టీఆర్‌ఎస్‌కో, బీజేపీకో బీ టీమ్‌గా ఉండాల్సిన అవసరం లేదన్నారు.