వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై విమర్శలు

వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై విమర్శలు

Ys Vijayamma

ys vijayamma: వైఎస్ కుటుంబంపై కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని, వైఎస్ఆర్ భార్యగా ప్రజలకు సమాధానం చెప్పేందుకు భహిరంగ లేఖ రాస్తున్నట్లుగా చెబుతూ ఓ లేఖను విడుదల చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మా కుటుంబమే లక్ష్యంగా వార్తలు రాస్తున్నారు. చంద్రబాబు బలాన్ని పెంచలేమని తెలిసినప్పుడల్లా వ్యతిరేక వార్తలు పచ్చ మీడియా రాస్తుంది. అసత్యాలతో వార్తలు వండి వారుస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా పచ్చమీడియా దారిలోనే మమ్మల్ని టార్గెట్ చేస్తూ వార్తలు రాస్తున్నారు.

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని ఘన విజయం వరించడంతో.. గెలవలేమని స్పష్టత వచ్చాక చంద్రబాబు.. పరిషత్ ఎన్నికలను బాయ్‍కాట్ చేస్తూ ప్రకటన చేశారు. ఇప్పుడు మా కుటుంబమే లక్ష్యంగా కొన్ని పత్రికలు, ఛానళ్లు దిగజారిన రాతలు రాస్తున్నారంటూ లేఖలో చెప్పుకొచ్చారు. వైఎస్ వివేకా హత్య ఎవరు చేశారన్నది కచ్చితంగా నిగ్గు తేలాల్సిందేనని, ఇందులో మా కుటుంబ సభ్యులందరిదీ ఒకటే మాట అని అన్నారు.

హత్య జరిగిన సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని, నాడు మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డిపై అనుమానాలు ఉన్నట్లుగా లేఖలో చెప్పుకొచ్చారు తిరుపతిలో ఆదినారాయణరెడ్డిని స్టేజీ మీద పెట్టుకుని పవన్ కళ్యాణ్ మా కుటుంబంపై విమర్శలు చేశారని, కేంద్రం పరిధిలోనే సీబీఐ ఉందని తెలిసి మరీ పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్‍పై 2018లో హత్యాయత్నం జరిగినప్పుడు చంద్రబాబే సీఎం.. రెండు కేసులనూ దర్యాప్తు చేస్తోంది కేంద్ర సంస్థలు సీబీఐ, ఎన్‍ఐఏనే.. నిజాలను పక్కదారి పట్టించేలా పత్రికలు కథనాలు రాస్తున్నాయి.

అందరిని గౌరవించే మనస్తత్వం సీఎం వైఎస్ జగన్‍ది.. ఓదార్పు, పాదయాత్రల్లో జగన్ స్వభావం ఏంటో ప్రజలు గమనించారు.. రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో ఉందని షర్మిల గట్టిగా నమ్మింది.. నా బిడ్డల మధ్య విభేదాలు తీసుకురావడానికి దిగజారుడు ప్రయత్నాలు చేస్తున్నారు.. తెలంగాణలో ఒకరు.. ఆంధ్రాలో ఒకరు ఉండాలనేది.. వారి అభిప్రాయమే తప్ప.. ఇద్దరి మధ్య విభేదాలు లేవని అన్నారు. వివేకా కేసులో హంతకులను గుర్తించి చట్ట ప్రకారం శిక్షించాల్సిందేనని లేఖలో రాసుకొచ్చారు.