సృష్టిలో ఒకే ఒక పొరపాటు.. మనిషికి మేధాశక్తిని ఇవ్వడం.. ‘జాంబీ రెడ్డి’ ఫస్ట్ బైట్..

  • Published By: sekhar ,Published On : December 5, 2020 / 07:21 PM IST
సృష్టిలో ఒకే ఒక పొరపాటు.. మనిషికి మేధాశక్తిని ఇవ్వడం.. ‘జాంబీ రెడ్డి’ ఫస్ట్ బైట్..

Zombie Reddy – Teaser: ‘అ!’, ‘కల్కి’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ రూపొందిస్తోన్న మూవీ .. ‘జాంబీ రెడ్డి’.
బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకుని ఇటీవల ‘ఓ బేబి’ సినిమాతో ఆకట్టుకున్న తేజా సజ్జ హీరోగా నటిస్తున్నాడు. ఆనంది, దక్షా నగార్కర్ హీరో హీరోయిన్స్‌. యాపిల్‌ ట్రీ స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌ శేఖర్‌ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా టీజర్‌ను ఫస్ట్‌ బైట్‌ పేరుతో స్టార్‌ హీరోయిన్‌ సమంత విడుదల చేశారు..

Zombie Reddy

‘‘దైవం మనుష్య రూపేణ అనేది ఇతిహాసం.. రాక్షసం మనుష్య రూపేణ అనేది ప్రస్తుతం.. భగవంతుని అద్భుత సృష్టిలో ఒకే ఒక పొరపాటు మనిషికి మేధాశక్తిని ఇవ్వడం. ఆ మేధా శక్తి తనకే ఓ ప్రశ్నగా నిలిస్తే, దైవం నేర్పే గుణపాఠం మనిషి ఉనికికే ప్రమాదం’’ అనే డైలాగ్స్‌తో పాటు జాంబీలు మనుషులపై దాడి చేయడం వంటివి ఆసక్తికరంగా చూపించారు.


టీజర్ చివర్లో దక్ష గన్‌తో, ఆనంది శూలంతో కనిపించగా, తేజ కుడిచేయి మణికట్టుపై గేమ్ ఆన్ అనే టాటూతో కనిపించాడు. కర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అసలు జాంబీలకు, కోవిడ్‌కు ఉన్న లింకేంటి? అనే విషయాలు హైలెట్ కానున్నాయి.

Zombie Reddy

తెలుగులో మొట్టమొదటి జాంబీ ఫిల్మ్‌గా ‘జాంబీ రెడ్డి’ ని రూపొందిస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారని టీజర్ చూస్తే తెలుస్తోంది.
సంగీతం : మార్క్ కె రాబిన్, కెమెరా : అనిత్, ఎడిటింగ్ : సాయి బాబు.