Home » ‘హత్రాస్ బాధితురాలి కుటుంబానికి సీఎం ఇచ్చిన మాట ఏమైంది’
Published
3 months agoon
By
subhnHathras: హత్రాస్ కేసు వాదిస్తున్న అడ్వకేట్ సీమా కుశ్వహ ఆ కుటుంబానికి ఢిల్లీలో పర్మినెంట్ నివాసం ఏర్పాటు చేయాలంటున్నారు. అలహాబాద్ హై కోర్టుకు చెందిన లక్నో బెంచ్ సోమవారం ఈ వాదనను వినాల్సి ఉంది.
‘అక్టోబరు 24న అఫిడవిట్లో పొందుపరిచిన నా డిమాండ్లను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందనుకుంటున్నా. మా డిమాండ్ ఏంటంటే సీఎం మాటిచ్చినట్లుగానే ఓ ఉద్యోగం ఇవ్వాల్సి ఉంది. అదింకా పూర్తి చేయలేదు. ఇంకొకటి ఆ కుటుంబానికి పర్మినెంట్ గా ఢిల్లీలో నివాసం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే హత్రాస్ అనే ప్రాంతంపై పూర్తిగా అగ్ర కులస్థుల ప్రభావం ఉంది’ అని కుశ్వాహ అన్నారు.
పోస్టు మార్టంలో బాధితురాలు రేప్ కు గురైనట్లు తెలుస్తుంది. 19ఏళ్ల ఆ యువతి గాయాలకు ఢిల్లీ సఫ్దార్జంగ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. సెప్టెంబర్ 14న దాడి జరిగితే.. సెప్టెంబర్ 29వరకూ ప్రాణాలతో పోరాడుతూనే ఉంది.
అక్టోబరు 12న అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్.. హత్రాస్ బాధితురాలి శరీరాన్ని అర్ధరాత్రి దహనం చేయడంపై మానవ హక్కుల ఉల్లంఘన అని స్టేట్మెంట్ ఇచ్చింది.
అక్టోబర్ 27న సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఈ కేసును మానిటర్ చేయాలంటూ సుప్రీం కోర్టు.. అలహాబాద్ హైకోర్టుకు సూచించింది. దళిత యువతిపై గ్యాంగ్ రేప్ ఆరోపణలపై విచారణను వేగవంతం చేశారు. ముగ్గురు జడ్జిలతో బెంచ్ ఏర్పాటు చేశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే.