ఆలస్యంగా వచ్చిన వరుడు.. మరొకరితో వధువు పెళ్లి!

  • Published By: sreehari ,Published On : December 9, 2019 / 02:46 PM IST
ఆలస్యంగా వచ్చిన వరుడు.. మరొకరితో వధువు పెళ్లి!

కాసేపట్లో పెళ్లి.. బరాత్ తో పెళ్లికొడుకు బిజీగా ఉన్నాడు. అర్ధరాత్రి దాటాక పెళ్లి వేదిక దగ్గరకు కుటుంబ సభ్యులతో చేరుకున్నాడు. ఆలస్యంగా పెళ్లికొడుకు వచ్చినందుకు పెళ్లికూతురు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడితో కలిసి ఇంటికి వెళ్లేందుకు తిరస్కరించింది.

అందుకు బదులుగా స్థానిక వ్యక్తిని వధువు పెళ్లి చేసుకుంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బిజనూర్ నంగాల్జత్ గ్రామంలో గతవారమే జరిగింది. అందిన రిపోర్టు ప్రకారం.. వధువరులకు ముందుగానే అక్టోబర్ నెలలో హడావుడిగా పెళ్లి జరిగింది. అందుకే మరోసారి డిసెంబర్‌లో ఘనంగా పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు.

ఇక పెళ్లికొడుకు సంప్రదాయం ప్రకారం.. దామ్ పూర్ టౌన్ నుంచి పెళ్లికూతురు ఇంటికి వస్తున్నాడు. బరాత్ కార్యక్రమంతో చాలా ఆలస్యమైంది. అర్ధరాత్రి దాటాక పెళ్లి వేదిక దగ్గరకు వచ్చాడు. మొదటినుంచే కట్నకానుల విషయాల్లో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి.

ఆలస్యంగా పెళ్లికొడుకు రావడంతో పెళ్లికూతురు అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో వరుడు ఫ్యామిలీ తమను నిర్భదించి విలువైన వస్తువులను దోచుకున్నారని పెళ్లికూతురి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇరు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించినట్టు హల్దార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కంతా ప్రసాద్ తెలిపారు.

రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆయన చెప్పారు. చివరికి రెండు కుటుంబాలు రాజీకి వచ్చాయన్నారు. కానీ, వరుడితో కలిసి వెళ్లేందుకు వధువు నిరాకరించింది. వధువరులిద్దరూ విడాకులు తీసుకునేందుకు అంగీకరించడంతో సమస్య సర్దుమనిగింది. వరుడు తన బంధువులతో కలిసి తిరిగి వెళ్లాడు. అదే సమయంలో వధువు.. పెద్దల సమక్షంలో స్థానిక వ్యక్తిని పెళ్లి చేసుకుంది.