Women : ఆడవారిలో గడ్డాలు, మీసాలు….ఇలా ఎందుకు జరుగుతుందంటే?

అవాంఛిత రోమాలు తొలగించడం కోసం మహిళలు వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు.

Women : ఆడవారిలో గడ్డాలు, మీసాలు….ఇలా ఎందుకు జరుగుతుందంటే?

Hair

Women : మహిళలకి అవాంచిత రోమాలు అసహ్యంగా కనిపిస్తుంటాయి. వీటి కారణంగా ధైర్యంగా బయటకు వెళ్ళలేని పరిస్ధితి ఉంటుంది. చాలా మంది మహిళలు చూడటానికి అందంగా కనిపించినా చంపలపై, మూతిపై వెంట్రుకలు కనిపిస్తుంటాయి. ఇవి చూసే వారు వారిని మగరాయుడు అన్నట్లుగా కామెంట్లు సైతం చేస్తుంటారు. పురుషుల మాదిరిగా ముఖం మీద, పైపెదవి మీద, ఒంటి మీద రోమాల వల్ల నలుగురిలోకి వెళ్ళేందుకు బిడియపడుతుంటారు. స్త్రీలలో మీసాలు, గడ్డాలు పెరగటాన్ని హిర్సుటిజం అంటారు.

హార్మోన్ల అస్తవ్యస్థం కారణంగా ఈ తరహా వెంట్రుకల పెరుగుదల కనిపిస్తుంది. బరువు అధికంగా ఉండే ఊబకాయుల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. శరీరంలో కీలక హార్మోన్లను ఉత్పత్తి చేసే అడ్రినల్‌, పిట్యూటరీ, థైరాయిడ్‌ వంటి గ్రంథుల హార్మోన్‌ వ్యవస్థ లో లోపాలు, పురుష హార్మోన్ స్ధాయిలు పెరిగిన సందర్భంలో ఈ పరిస్ధితి తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల మందులు, స్ఠిరాయిడ్స్ వల్ల కూడా అవాంఛిత రోమాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది.

అవాంఛిత రోమాలు తొలగించడం కోసం మహిళలు వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. హెయిర్ రిమూవల్ క్రీములు, త్రెడింగ్, వ్యాక్సింగ్, ప్లకింగ్, లేజర్ ట్రీట్ మెంట్ల వంటి పలు రకాల పద్ధతుల ద్వారా వాటిని తొలగించుకుంటుంటారు. మరికొందరైతే షేవింగ్ లు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో వైద్యులను సంప్రదించి తగిన వైద్యసహాయం పొందటం ఉత్తమం. అయితే సాధారణంగా కొన్ని చిట్కాల ద్వారా కూడా వీటిని తొలగించుకోవచ్చు.

అవాంఛిత రోమాలు తొలగించే చిట్కాలు ;

ఒక స్పూన్ నిమ్మరసం తీసుకుని దానికి ఒక స్పూన్ పంచదార చేర్చాలి. రెండిటిని బాగా కలిపి పెదవిపై రాసి సుమారు అరగంట పాటు ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రంగా కడిగేయాలి. అనంతరం రోజ వాటర్ పెదాలకు రాయాలి. ఇలా నెల రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పసుపు అవాంచిత రోమాలని నివారించడంలో ఎంతో బాగా ఉపయోగ పడుతుంది. స్వచ్చమైన పసుపు తీసుకుని, అందులో కొంచం నీళ్ళు పోసి మెత్తగా అయిన తరువాత రోమాలు ఉన్న పెదవి పై అప్లై చేసి సుమారు గంట పాటు ఉంచాలి. ఇలా నెలరోజులు చేస్తే అవాంచిత రోమాలు పోగొట్టువచ్చు.

గుడ్డు తెల్లసొనలో కొంచెం మొక్కజొన్న పిండి, పంచదార కలిపి పేస్ట్ త‌యారుచేసుకోవాలి. దీనిని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే అవాంఛిత రోమాల పెరుగుదలను ఆపవచ్చు.

ఒక స్పూన్ బంగాళాదుంప రసం తీసుకుని అందులో అరస్పూన్ మైదా పిండి కలుపుకోవాలి. ఇలా కలిపినా మిశ్రమాన్ని జుట్టు ఉన్న పెదవులపై రాసి 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

శెనగపిండిలో కొంచెం నీళ్లు, పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిన త‌ర్వాత‌ చేతి వేళ్లతో నెమ్మదిగా రుద్దాలి. ఇలా చేస్తుండడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.