కరోనా వైరస్ ఇమ్యూనిటీ.. కోలుకున్న వారిలో కొన్ని నెలలే ఉంటుంది.. అధ్యయనంలో తేలింది!

  • Published By: sreehari ,Published On : July 13, 2020 / 09:58 PM IST
కరోనా వైరస్ ఇమ్యూనిటీ.. కోలుకున్న వారిలో కొన్ని నెలలే ఉంటుంది.. అధ్యయనంలో తేలింది!

కోలుకున్న రోగులలో COVID-19కు రోగనిరోధక శక్తి కొన్ని నెలలు మాత్రమే ఉంటుందని కొత్త అధ్యయనంలో తేలింది. ఒక సాధారణ జలుబు మాదిరిగా మళ్ళీ తిరగబెడుతుందని అధ్యయనం వెల్లడించింది. గైస్ సెయింట్ Thomas NHS ట్రస్టులోని 90 మంది రోగులు, ఆరోగ్య కార్యకర్తల రోగనిరోధక ప్రతిస్పందనను లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు పరిశీలించారు. కరోనావైరస్ లక్షణాలు ప్రారంభమైన మూడు వారాల తరువాత యాంటీ బాడీస్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, ఆ తరువాత క్షీణించాయని గుర్తించారు.

COVID-19తో పోరాడే రోగుల్లో 60శాతం మందిలో ‘శక్తివంతమైన’ స్థాయి యాంటా బాడీస్ ఉన్నట్టు రక్త పరీక్షల్లో తేలింది. ఏదేమైనా, 3 నెలల తరువాత 17శాతం మందిలో మాత్రమే యాంటీ బాడీస్ ఉన్నాయని, మిగతా వారిలో యాంటీ బాడీస్ క్షీణించినట్టు కనుగొన్నారు. యాంటీబాడీస్.. కొన్ని సందర్భాల్లో 23 రెట్లు తగ్గగా.. ఇతరులలో పూర్తిగా క్షీణించినట్టు అధ్యయనంలో తేలింది.

ప్రముఖ రచయిత డాక్టర్ Katie Doores ది గార్డియన్‌తో చెప్పిన ప్రకారం.. ‘కోవిడ్ బాధితులు వైరస్‌కు సహేతుకమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే తక్కువ వ్యవధిలో యాంటీ బాడీస్ క్షీణిస్తున్నాయని, అవి ఎంతకాలం శరీరంలో ఉంటాయనేది నిర్ణయించవచ్చునని తెలిపారు. ‘ఇన్ఫెక్షన్ యాంటీబాడీ రెస్పాన్స్.. మీ ఇన్ఫెక్షన్ మీకు రెండు మూడు నెలల్లో క్షీణిస్తున్న యాంటీబాడీ స్థాయిలను ఇస్తుంది. టీకా అదే పని చేస్తుంది. COVID-19 అత్యంత తీవ్రమైన కేసులను కలిగి ఉన్న రోగులలో అత్యధిక యాంటీబాడీ స్థాయిలు ఉన్నాయని ఆమె సూచించారు. ఆ యాంటీ బాడీస్ ఎక్కువకాలం పాటు శరీరంలోనే ఉన్నాయని సూచించారు. భవిష్యత్‌లో ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ వస్తుందా? అనేదానిపై కూడా ఈ అధ్యయనం లేవనెత్తింది.

ఈ అధ్యయనంలో దీనిపై నిపుణులు పరిశీలించినప్పటికీ.. గతంలో వైరస్ బారిన పడిన వారు రోగనిరోధక శక్తిని కలిగి ఉంటే.. వారికి ఇది ఒక హెచ్చరికగా పేర్కొన్నారు. లండన్ కాలేజ్ కాలేజీలోని వైరల్ ఇమ్యునాలజీ ప్రొఫెసర్, కన్సల్టెంట్ ఫిజిషియన్ మాలా మైనీ చెప్పిన ప్రకారం.. ‘ఈ అధ్యయనం COVID-19 సోకిన ఎవరైనా వారు మొదట యాంటీబాడీగా మారిపోతారు. మళ్లీ వారికి వైరస్ పాజిటీవ్ రాదని కచ్చితంగా చెప్పలేమన్నారు. సహజమైన ఇన్ఫెక్షన్ కంటే ఎక్కువ కాలం ఉండే యాంటీబాడీలను ప్రేరేపించడంలో టీకాలు మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తిని కొనసాగించడానికి టీకాల మోతాదులను కూడా పెంచాల్సిన అవసరం ఉంటుందని సూచిస్తున్నారు.