Diabetes Fruits : డయాబెటిస్ ఉన్న వారు ఎలాంటి పండ్లు తినాలో తెలుసా!…
జీఐ తక్కువగా ఉండే పండ్లతో మధుమేహుల్లో చక్కెర, ఇన్సులిన్ లెవెల్స్కు ఎలాంటి చేటు చేయవు. ఇక మధుమేహులు పీచ్, చెర్రీ, ప్లమ్, యాపిల్, ఆరంజ్ వంటి పండ్లను తీసుకోవచ్చని వీటి
Diabetes Fruits : షుగర్ వ్యాధి వచ్చిందంటే చాలు.. చాలా మంది తినే ఆహారం విషయంలో అనేక సందేహాలతో ఉంటారు. ఏం తినాలి, ఏం తినకూడదనే అనుమానం నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. కనీసం పండ్లు తినాలన్నా భయపడుతుంటారు. పండ్లు తినేందుకు వెనుకముందు ఆలోచిస్తుంటారు. అయితే కొన్ని పండ్లను తినవచ్చని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లను షుగర్ వ్యాధి గ్రస్తులు తినవచ్చని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. మధుమేహులు జీఐ తక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం ద్వారా ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలగడంతో పాటు వాటిలో పొటాషియం, ఫైబర్తో పాటు పలు విటమిన్లు, శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
జీఐ తక్కువగా ఉండే పండ్లతో మధుమేహుల్లో చక్కెర, ఇన్సులిన్ లెవెల్స్కు ఎలాంటి చేటు చేయవు. ఇక మధుమేహులు పీచ్, చెర్రీ, ప్లమ్, యాపిల్, ఆరంజ్ వంటి పండ్లను తీసుకోవచ్చని వీటి జీఐ 45 కంటే తక్కువగా ఉండటం వారి ఆరోగ్యానికి మేలు చేస్తుందని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. యాపిల్ పండును షుగర్ వ్యాధి గ్రస్తులు తినటం వల్ల ఇన్ ఫెక్షన్లను దూరంగా పెట్టవచ్చు. ద్రాక్షపండ్లు తినటం వల్ల రక్తప్రసరణ మెరుగవ్వటంతోపాటు, కొవ్వుశాతం తగ్గుతుంది.
దానిమ్మ పండును షుగర్ వ్యాధి ఉన్న వారు తినటం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తాయి. ఇందులో చక్కెర నిల్వలు స్వల్పంగా ఉంటాయి. నారింజ, నేరేడు , జామ, పైనాపిల్, అంజీర్ వంటి పండ్లను షుగర్ వ్యాధి గ్రస్తులు తినవచ్చు. ఇలాంటి పండ్లను అధిక మోతాదులో కాకుండా, తరచూ తీసుకోవటం వల్ల చక్కెర స్ధాయి నియంత్రణలో ఉంటుంది.