ఇది ముఖంపై పూసే ఫెయిర్నెస్ క్రీమ్ లాంటిది. తుడిస్తేపోతుంది. మోడీ #SheInspiresUs గౌరవాన్ని కాదన్న 8ఏళ్ల మణిపురి యాక్టివిస్ట్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసర్కించుకుని #SheInspiresUs ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ప్రధానం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గౌరవార్థాన్ని మణిపురి పర్యావరణ కార్యకర్త లిసిప్రియా కంగూజామ్ తిరస్కరించింది. పర్యావరణ మార్పులపై తన డిమాండ్లను ఎవరూ పట్టించుకోలేదంటూ 8ఏళ్ల బాలిక పర్యావరణ కార్యకర్తగా ఆవేదన వ్యక్తం చేసింది. పర్యావరణంలో కలిగే పెనుమార్పులపై తన ఎనిమిదేళ్ల కథను ప్రేరణగా భావించిన ప్రభుత్వం శుక్రవారం ట్విట్టర్ వేదికగా లిసిప్రియా పలు విషయాలను పంచుకుంది.
“@మైగోవిండియా @LicypriyaK మణిపూర్ నుండి వచ్చిన చిన్నారి పర్యావరణ కార్యకర్త. 2019లో ఆమెకు డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం చిల్డ్రన్ అవార్డు, ప్రపంచ పిల్లల శాంతి బహుమతితోపాటు భారత శాంతి బహుమతి లభించింది. ఆమె స్ఫూర్తిదాయకం కాదా? ఆమెలాంటి వ్యక్తి మీకు తెలుసా? #SheInspiresU హ్యాష్ ట్యాగులు జోడించండి”అంటూ ప్రభుత్వం మైక్రో బ్లాగింగ్ సైట్లో పోస్ట్ చేసింది.
దీనిపై స్పందిస్తూ గత ఏడాది జూలైలో పార్లమెంటు బయట నిరసన ప్రదర్శన చేసిన కంగూజమ్ ఇలా ట్వీట్ చేసింది.. “ప్రియమైన నరేంద్ర మోడీ, మీరు నా ఆవేదనను వినని పక్షంలో దయచేసి మా గురించి సెలబ్రేషన్స్ జరుపుకోవద్దు. మీ చొరవతో #SheInspiresUs కింద దేశంలోని స్ఫూర్తిదాయకమైన మహిళలలో ఒకరిగా నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు.
చాలాసార్లు ఆలోచించిన తరువాత.. నాకిచ్చిన ఈ గౌరవాన్ని తిరస్కరించాలని నిర్ణయించుకున్నాను. జై హింద్! ’ అంటూ ఆమె రీట్వీట్ చేసింది. ప్రభుత్వం నుండి గుర్తింపు సాధించడానికి గౌరవప్రదమని భావించినప్పటికీ, కానీ వాతావరణంలోని మార్పులను అరికట్టే విషయంలో తన డిమాండ్లను వినలేదనే బాధే ఎక్కువగా ఉందని ఆమె వాపోయింది.
@LicypriyaK is an child environmental activist from Manipur. In 2019, she was awarded a Dr. APJ Abdul Kalam Children Award, a World Children Peace Prize, and an India Peace Prize. Isn’t she inspiring?
Do you know someone like her? Tell us, using #SheInspiresUs . pic.twitter.com/bJLEDIwfpH— MyGovIndia (@mygovindia) March 5, 2020
“నాకు ఈ విషయం తెలిసినప్పుడు నేను నమ్మలేకపోయాను. ఆ తర్వాత నేను గర్వంగా భావించాను. కాని చాలా బాధగా ఉంది. నా డిమాండ్లను నిరంతరం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికి పట్టించుకోనప్పుడు ఇలాంటి గుర్తింపును నేను అంగీకరించాలా అనిపించింది’ అని కంగూజామ్ అన్నారు.
“ఈ క్యాంపియన్ మహిళల్లో స్పూర్తికోసమే కావొచ్చు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను పరిశీలిస్తే.. అది పరిష్కరించగలదని నేను అనుకోను. ఇది మా ముఖం మీద పూసే ఫెయిర్నెస్ క్రీమ్ లాంటిది. ఇది ఒకసారి తుడిస్తేపోతుంది.. తర్వాత ఇక ఉండదు. దీనికి బదులుగా, మోడీ.. నా ఆవేదన వినాలని, మా నేతలంతా వాతావరణ మార్పులను తీవ్రంగా పరిగణించాలని నేను కోరుకుంటున్నాను.
Dear @narendramodi Ji,
Please don’t celebrate me if you are not going to listen my voice.Thank you for selecting me amongst the inspiring women of the country under your initiative #SheInspiresUs. After thinking many times, I decided to turns down this honour. ??
Jai Hind! pic.twitter.com/pjgi0TUdWa
— Licypriya Kangujam (@LicypriyaK) March 6, 2020
#SheInspiresUs ఒక సామాజిక మీడియా ప్రచారం “మిలియన్ల మంది మహిళల్లో ప్రేరణకు సహాయం చేస్తుంది” మహిళలు అంకితం. “ఈ మహిళా దినోత్సవం, నా సోషల్ మీడియా ఖాతాలను వారి జీవితం, పనికి.. మాకు స్ఫూర్తినిచ్చే మహిళలకు ఇస్తాను.
ఇది లక్షలాది మందిలో ప్రేరణను కలిగించడానికి వారికి సహాయపడుతుంది. మీరు అలాంటి మహిళనా లేదా అలాంటి ఉత్తేజకరమైన స్త్రీలు మీకు తెలుసా? ఇలాంటి కథలను #SheInspiresU లను ఉపయోగించి షేర్ చేయండి’ అని మోడీ మార్చి 3న ట్వీట్ చేశారు.
See More | వైరల్ వీడియో: స్కూటీతో సహా..శివాలయంలో నందీశ్వరుడి కాళ్లపై పడిపోయిన అమ్మాయి!!