Covid-19 Antibody Drug : కరోనా చికిత్సకు Roche/Regeneron యాంటీబాడీ కాక్‌టైల్ డ్రగ్.. భారత్ ఆమోదం

భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనాను కట్టడి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా.. మరో యాంటీబాడీ కాక్ టైల్ డ్రగ్‌‌కు ఆమోదం లభించింది.

Covid-19 Antibody Drug : కరోనా చికిత్సకు Roche/Regeneron యాంటీబాడీ కాక్‌టైల్ డ్రగ్.. భారత్ ఆమోదం

India Approves Roche Regeneron Antibody Cocktail To Treat Covid 19

Covid-19 Antibody Drug : భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనాను కట్టడి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా.. మరో యాంటీబాడీ కాక్ టైల్ డ్రగ్‌‌కు ఆమోదం లభించింది. రోచె (ROG.S) రెజెనెరాన్ (REGN.O) అభివృద్ధి చేసిన COVID-19 యాంటీబాడీ డ్రగ్ కాక్‌టైల్ కు భారత్ అత్యవసర వినియోగ అధికారాన్ని ఇచ్చింది. దేశంలో సెకండ్ వేవ్ వ్యాప్తితో పోరాడటానికి ఈ డ్రగ్‌ను సంస్థ విస్తరించింది.

యుఎస్ రెగ్యులేటర్లకు దాఖలు చేసిన డేటా, యూరోపియన్ రెగ్యులేటరీ ప్యానెల్ అభిప్రాయం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోచె ఇండియా డిస్ట్రిబ్యూషన్ పార్టనర్ Cipla (CIPL.NS) తెలిపింది. కరోనా చికిత్సకు వాడే ఈ డ్రగ్‌లో Casirivimab, Imdevimab అనే రెండు యాంటీబాడీల కాక్ టైల్.. వైరస్ సోకిన తర్వాత శరీరంలో ఉత్పత్తి చేసే యాంటీబాడీలకు కృత్రిమంగా తయారు చేసిన కాపీలుగా చెబుతున్నారు పరిశోధకులు. తీవ్ర ముప్పు ఉన్న COVID-19 రోగులలో ఈ డ్రగ్ వాడితే.. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని తగ్గించినట్టు తేలింది.

ఈ డ్రగ్ ఇప్పటికే అమెరికాలో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందింది. ఐరోపాలో ఆసుపత్రిలో చేరని కరోనా రోగులకు ఇచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు
డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాధి బారిన పడినప్పుడు ఇదే డ్రగ్ తీసుకున్నారు. తీవ్రమైన వ్యాధి వచ్చే ప్రమాదం ఉన్నవారితోపాటు తేలికపాటి నుంచి స్వల్పంగా వైరస్ లోడ్ ఉన్నవారికి ఈ డ్రగ్ ప్రయోజనకరంగా ఉంటుందని సిప్లా కంపెనీ వెల్లడించింది. ఈ డ్రగ్ ధర లేదా ప్రారంభ తేదీని వెల్లడించలేదు. గత 10 రోజుల్లో 33వేల మందికి పైగా భారతీయులు COVID-19తో మరణించారు.

దేశంలో గిలియడ్ (GILD.O) అభివృద్ధి చేసిన రెమ్‌డెసివిర్, రోచె tocilizumabతో సహా COVID-19 డ్రగ్స్ కొరతను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ, స్థానిక తయారీదారులు ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్ లో కరోనావైరస్ కేసుల సంఖ్య 20 మిలియన్లను దాటింది. యునైటెడ్ స్టేట్స్ తరువాత భారత్ రెండవ స్థానంలో ఉంది. కరోనా మరణాలు 226,188కు చేరుకున్నాయి. అధికారక గణాంకాల కంటే అసలు కరోనా మరణాల సంఖ్య చాలా రెట్లు ఎక్కువగా ఉండొచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.