డ్రై ఫ్రూట్స్ దండ : పొలిటికల్ పుత్రరత్నానికి రాచమర్యాద
అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల మర్యాదలు ఓ రేంజ్ లో ఉంటాయి. అంతకు మించి వారి పుత్తర రత్నాలకు కూడా దక్కుతుంటాయి. పొలిటికల్ లీడర్ల ప్రాపకం కోసం తాపత్రాయ పడేవారు ఆయా నాయకుల పుత్ర రత్నాలకు మర్యాదలు చేస్తుంటారు. ఈ క్రమంలో నాయకుల కుమారులు లేదా కుమార్తెల (బంధుగణం) జపం చేస్తుంటారు కొందరు.
కన్నడనాట వంశపారంపర్య పార్టీగా వెలుగుతున్న జె.డి.(ఎస్)లో దేవగౌడ మనుమడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడకు ఇప్పుడు అటువంటి రాచ మర్యాదలే జరుగుతున్నాయి. ఎంపీగా మాండ్య నుంచి పోటీ చేస్తున్నాడు. ఇంత రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నిఖిల్ గౌడ రాచమర్యాదలు ఎలా ఉంటుందో ఊహించవచ్చు.
మాండ్య ఎంపీ బరిలో ఉన్న నిఖిల్ కు స్వాగతం పలికేందుకు స్థానిక నాయకుడు కార్తీక్ గౌడ వెరైటీ దండను తయారు చేయించాడు. బాదం, ఎండుద్రాక్షలతో 300 కిలోల దండను తయారు చేయించాడు. దీంతో ఈ వెరైటీ దండ తయారీకి ఎంత ఖర్చు అయ్యుంటుందోనని స్థానికులు లెక్కలు వేశారు. ఈ లెక్కన దీని తయారీ ఖర్చు రూ.1.80 లక్షలుగా తేలింది. అభిమానానికి కూడా ఓ హద్దు ఉండొద్దా అంటు ఆశ్చర్యపోతు..ఈ దండ బరువూ..ఖర్చు ఏమో గానీ..ఆ దండ మెడలో వేయించుకుంటే నిఖిల్ పరిస్థితి ఏంటోనని అనుకుంటున్నారు.
కాగా ఆ దండ తయారీ దారుడు మాట్లాడుతు..నిఖిల్ కోసం తయారు చేసిన ఈ దండ తయారు చేయటానికి 20 మంది పనిచేశారని విభిన్నమైన (పూల)దండలు తయారు చేయటంలో పేరొందిన ధన్ రాజ్ తెలిపాడు.