Mimosoideae : సంతానలేమి సమస్యలను తొలగించే నల్లతుమ్మ

తుమ్మ ఆకులను నీటితో నూరి చర్మానికి రాయడం వల్ల అధిక చెమట సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. తుమ్మ చెట్టు బెరడుతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల నీరసం తగ్గి బలాన్ని పుంజుకుంటారు.

Mimosoideae : సంతానలేమి సమస్యలను తొలగించే నల్లతుమ్మ

Mimosoideae (1)

Mimosoideae : నల్ల తుమ్మ చెట్టులో ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుందని ఆయుర్వేదనిపుణులు చెబుతున్నారు. ఈ చెట్టు కాండంతో గృహ అవసరాలతోపాటు, వ్యవసాయ పనిముట్ల తయారీలో ఉపయోగిస్తారు. మేకలు ఈ చెట్టు ఆకులను ఎంతో ఇష్టంగా తింటాయి. అయితే మగ వారిలో వచ్చే సంతాన లేమి సమస్యలను తగ్గించడంలో ఈ చెట్టు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పురాతన వైద్యమైన ఆయుర్వేదంలో నల్లతుమ్మ సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి ఔషదంగా ఉపయోగించేవారు. మగ వారిలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండడం, నరాల బలహీనత, శీఘ్ర స్కలనం వంటి సంతాన లేమి సమస్యలు ఇబ్బంది కలిగిస్తుంటాయి.

మానసిక ఒత్తిడి, ధూమపానం, మద్య పానం, ఆహారపు అలవాట్ల కారణంగా మగ వారిలో సంతాన లేమి సమస్యలు వస్తాయి. సంతాన లేమి సమస్యలకు తుమ్మ చెట్టు దివ్య ఔషధంగా పని చేస్తుంది. తుమ్మ జిగురును పొడిగా చేసి నెయ్యిలో వేయించి శరీర బలాన్ని బట్టి కొద్ది కొద్దిగా తినడం వల్ల మగ వారిలో వీర్య కణాలు వృద్ది చెందుతాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తుమ్మ చెట్టు పూలు కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. తుమ్మ చెట్టు బెరడు, లేత కాయలు, ఆకులు, పువ్వులను నీడలో ఎండబెట్టి చూర్ణంగా చేసి సమపాళ్లలో కలిపి ఆ పొడిని ప్రతిరోజూ పావు టీ స్పూన్ చొప్పున తేనెతో కలిపి తీసుకోవడం వల్ల దృఢంగా మారతారు.

రక్తస్రావం, ల్యుకోరియా, స్క్లెరోసిస్, ఆప్తాల్మియా, మశూచి, నపుంసకత్వం వంటి వ్యాధులు సైతం దూరమౌతాయి. నల్ల తుమ్మ కాయల రసాన్ని తీసి మినుములతో కలిపి ఔషధంగా తయారు చేసి పాలతో కలిపి తాగడం వల్ల నరాల బలహీనత, వీర్య నష్టం, శీఘ్ర స్కలనం వంటి సమస్యలు తగ్గి అమితంగా వీర్య కణాల సంఖ్య పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నల్ల తుమ్మ విత్తనాలు మొలకెత్తిన తరువాత కూరల్లో వాడుకోవచ్చు. వాటిని మద్యం తయారీలో ఉపయోగిస్తారు. నల్ల తుమ్మ బెరడుతో కషాయం తయారు చేసి రోజూ నోట్లో వేసుకుని పుక్కిలిస్తుంటే అల్సర్లు తగ్గుతాయి.

తుమ్మ ఆకులను నీటితో నూరి చర్మానికి రాయడం వల్ల అధిక చెమట సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. తుమ్మ చెట్టు బెరడుతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల నీరసం తగ్గి బలాన్ని పుంజుకుంటారు. ఈ కషాయాన్ని నోట్లో వేసుకుని పుక్కిలించడం వల్ల చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడంతోపాటు నోటి పూత, నోటిలో ఉండే పుండ్లతోపాటు దంతాల సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాళ్ల పగుళ్లను తగ్గించే శక్తి తుమ్మ బంకకు ఉంది. తుమ్మ బంకను నీటితో మెత్తగా నూరి రాత్రి పూట కాళ్ల పగుళ్లకు లేపనంగా రాస్తూ ఉంటే కొన్ని రోజులకు కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.

గమనిక ; ఈ సమాచారాన్ని అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే అందించటం జరిగింది. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందటం శ్రేయస్కరం.