అంబానీ ఫ్యామిలీనా మజాకా : కోడలికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన అత్త
ముంబై : ఏదైనా ఆర్భాటంగా చేస్తే ఏంటీ అంబానీ అనుకుంటున్నావా అంటాం. అంబానీ కుటుంబం ఏం చేసినా అదొక సంచలనమే. ఇక వారింట్లో పెళ్లి వేడుకలు ఆకాశమే దిగి వచ్చిన తారలతో తోరణాలు కట్టినట్లుల వారి పిల్లల పెళ్లిళ్లు జరిగాయి.
Read Also : కమింగ్ సూన్ : 100GBతో.. Jio ట్రిపుల్ ప్లే ప్లాన్!
ఈ క్రమంలో ఇటీవలే కన్నుల పండుగగా జరిగినా ముఖేశ్ అంబానీ, నీతా దంపతుల కుమారుడు ఆకాశ్, శ్లోకా మెహతాలకు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం తరువాత నీతా అంబానీ కోడలికి ఘనమైన కానుకనిచ్చారు. ఇప్పుడు అదే కొత్త టాపిక్.
అంబానీ కుటుంబాలకు వారసత్వంగా వస్తున్న బంగారు హారాన్ని శ్లోకాకు ఇవ్వాలని భావించారు నీతా. కానీ తాను ఇచ్చే కానుక మరింత విశేషంగా ఉండాలని అనుకున్న ఆమె ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగను ఇవ్వాలని అనుకున్నారట. ఇంకేముంది? అంబానీ తలచుకుంటే అందెత చెప్పండి.
వజ్ర వైఢూర్యాలు, నవరత్నాలు పొదిగిన రూ. 300 కోట్ల విలువైన బంగారు నక్లెస్ ను కోడలు శ్లోకా కోసం ప్రత్యేకంగా తయారు చేయించి కానుకగా ఇచ్చారు. ఆ నగను ధరించిన శ్లోకా మెహతాను చూసి నీతా అంబానీ మురిసిపోయారట.