Salt : ఉప్పుతో మధుమేహం ముప్పు…

అధిక ఉప్పుతో రక్తపోటు, అధిక బరువు పెరగడంతో మధుమేహం వస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వల్ల చివరకు గుండె జబ్బులకు కారణం మయ్యే అవకాశాలు ఉంటాయి.

Salt : ఉప్పుతో మధుమేహం ముప్పు…

Sugar Salt

Salt : ఉప్పు అధికంగా వాడితే రక్తపోటు వస్తుందని మాత్రమే ఇప్పటి వరకు వినుంటాం..అయితే ఉప్పు ఎక్కవగా తీసుకునే వారికి మధుమేహం కూడా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మందికి కూరల్లో ఉప్పులేనిదే రుచించదు. పెరగన్నం తినే సమయంలో ఉప్పు తప్ననిసరిగా వేసుకోవాల్సిందే…ఊరగాయ పచ్చళ్లల్లో ఇక చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఉప్పును మోతాదుకు మించి తినటం వల్ల రక్తపోటు వస్తుందని ఇప్పటికే వైద్యులు స్పష్టం చేస్తూ వస్తున్నారు. తాజాగా ఉప్పు అధిక మోతాదులో తీసుకుంటే మధుమేహం కూడా వస్తుందని పరిశోధకలు చెప్తున్నారు.

స్టాక్‌హోంలోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్యయనంలో ఈ విషయం తేలింది.. రోజుకు రెండు చెంచాలు తీసుకునే వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నట్లు తేలింది. తీపి పదార్థాలు, చక్కెర, పండ్లరసాలతో పాటుగా, ఉప్పు ఎక్కువగా తీసుకోవడంతో మధుమేహంతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఉప్పు ఇన్సులిన్‌కు ఉత్పత్తికి విఘాతంగా మారి మధుమేహానికి దారి తీస్తున్నట్టు చెబుతున్నారు.

అధిక ఉప్పుతో రక్తపోటు, అధిక బరువు పెరగడంతో మధుమేహం వస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వల్ల చివరకు గుండె జబ్బులకు కారణం మయ్యే అవకాశాలు ఉంటాయి. రోజుకు 1500 మి.గ్రా సోడియం మించకుండా చూసుకోవాలి. కూరలు, పచ్చళ్లు, చిరుతిళ్లు, పెరుగులో అదనంగా వేసుకుంటే ప్రమాదం తెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూరల్లో తక్కువ ఉప్పు వేయాలి. బయట తయారు చేసే పదార్థాలు వీలైనంత మానుకోవటం ఉత్తమం. ఉప్పుకు బదులు కాస్త మిరియాల పొడి వాడటం వల్ల మధుమేహం ముప్పు నుంచి బయట పడే అవకాశాలున్నాయి.