yogurt : పెరుగుతోపాటు వీటిని కలిపి తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
పెరుగులో చక్కెర కలుపుకుని తింటే శరీరానికి తక్ణణ శక్తి లభిస్తుంది. ఎండ దెబ్బకు గురైన వారు, బాగా శారీరక శ్రమ, వ్యాయామం చేసి అలసిపోయిన వారు పెరుగు, చక్కెర కలుపుకుని తీసుకుంటే కోల్పోయిన శక్తి వెంటనే లభిస్తుంది.
yogurt : పెరుగు తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ప్రతిరోజు భోజనంలో కూర అన్నం తిన్నాక చివరిగా పెరుగన్నం తినటం అందరికి అలవాటు. ముఖ్యంగా గడ్డపెరుగును చాలా మంది లొట్టలేసుకుని తింటారు. దీన్ని రోజూ కొందరు స్మూతీలు, జ్యూస్లలోనూ కలుపుకుని తాగుతారు. భారతీయులు ఎంతో కాలం నుంచి పెరుగును ఉపయోగిస్తున్నారు. పెరుగులో వివిధ రకాల పదార్ధాలను కలుపుకుని తీసుకోవటాన్ని చాలా మంది ఇలా చేయటం వల్ల కొన్ని ఆరోగ్యప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు సైతం సూచిస్తున్నారు.
పెరుగులో కాల్షియం, విటమిన్ బి, బి12, పొటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి ఎంతగానో మేలు జరుగుతుంది. కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే విటమిన్ బి12, రైబోఫ్లేవిన్లు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. పెరుగులో విటమిన్ డి మనకు సహజసిద్ధంగా లభిస్తుంది. పెరుగు తినటం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. డిప్రెషన్ తగ్గుతుంది.
పెరుగులో ఏయే పదార్ధాలు కలుపుకోవాలంటే….
పెరుగులో చక్కెర కలుపుకుని తింటే శరీరానికి తక్ణణ శక్తి లభిస్తుంది. ఎండ దెబ్బకు గురైన వారు, బాగా శారీరక శ్రమ, వ్యాయామం చేసి అలసిపోయిన వారు పెరుగు, చక్కెర కలుపుకుని తీసుకుంటే కోల్పోయిన శక్తి వెంటనే లభిస్తుంది. అలాగే మూత్రం ధారాళంగా వస్తుంది. శరీరంలో వేడి తగ్గుతుంది.
పెరుగులో తరచూ తేనె కలిపి తింటే జీర్ణాశయంలో ఉండే అల్సర్లు మాయమవుతాయి. జీలకర్ర పొడిని కొద్దిగా తీసుకుని దాన్ని ఒక కప్పు పెరుగులో కలుపుకుని తింటే అధిక బరువు తగ్గుతారు. నల్ల ఉప్పును తీసుకుని పొడి చేసి దాన్ని కొద్ది మోతాదులో పెరుగులో కలిపి తినాలి. దీంతో గ్యాస్, అసిడిటీ సమస్యలను తగ్గించుకోవచ్చు.
పెరుగులో వాము కలిపి తినడం వల్ల నోటి పూత, దంతాలు, చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. పసుపు, కొద్దిగా అల్లం రసం తీసుకుని పెరుగులో కలిపి తింటే శరీరానికి ఫోలిక్ యాసిడ్ అనే పోషకం అందుతుంది. ఇది చిన్నారులకు, గర్భిణీలకు ఎంతగానో అవసరం. పెరుగులో ఓట్స్ కలిపి తింటే శరీరానికి ప్రో బయోటిక్స్, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి.
నిత్యం వివిధ రకాల తాజా పండ్లను ముక్కలుగా కట్ చేసి వాటిని పెరుగులో కలిపి తినాలి. దీంతో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగులో నారింజ పండు రసం కలిపి తింటే శరీరానికి విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.నల్ల మిరియాల పొడిని పెరుగులో కలిపి తింటే మలబద్దకం తగ్గి తిన్నఆహారం త్వరగా జీర్ణమవుతుంది.