గ్యాంగ్ లీడర్ కోసమే వెయిటింగ్ అమ్మా!.. 

ప్ర‌స్తుతం దేశమంత‌టా లాక్‌డౌన్ ప‌రిస్థితి నెల‌కొన్న నేపథ్యంలో సెల‌బ్రిటీలంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. అలాగే ప్ర‌స్తుతం తెలుగు చిత్ర‌సీమ‌లో ‘బీ ద రియ‌ల్ మేన్‌’ ఛాలెంజ్ ట్రెండింగ్

గ్యాంగ్ లీడర్ కోసమే వెయిటింగ్ అమ్మా!.. 

ప్ర‌స్తుతం దేశమంత‌టా లాక్‌డౌన్ ప‌రిస్థితి నెల‌కొన్న నేపథ్యంలో సెల‌బ్రిటీలంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. అలాగే ప్ర‌స్తుతం తెలుగు చిత్ర‌సీమ‌లో ‘బీ ద రియ‌ల్ మేన్‌’ ఛాలెంజ్ ట్రెండింగ్‌లో ఉంది. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్‌లో సినీ ప్ర‌ముఖులంద‌రూ పాల్గొన‌డ‌మే కాకుండా వారికి న‌చ్చిన వారిని ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నారు. ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎన్టీఆర్  ఛాలెంజ్‌లో పాల్గొనాలంటూ బాల‌కృష్ణ‌, చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేశ్‌, కొర‌టాల‌ను నామినేట్ చేశాడు.

ఇప్ప‌టికే కొర‌టాల ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు. ఇక అగ్ర క‌థానాయ‌కులు చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్‌ల‌లు ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాల్సి ఉంది. తారక్ ఛాలెంజ్‌ను అంగీకరించిన చిరంజీవి ఛాలెంజ్‌లో పాల్గొంటానని అన్నారు. లేటెస్ట్‌గా విక్ట‌రీ వెంక‌టేష్ తాను కూడా ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేస్తున్నాన‌ని ట్వీట్ చేశారు. అయితే త‌మ గ్యాంగ్‌లీడ‌ర్ చిరంజీవి వీడియో కోసం తాము వెయిట్ చేస్తున్న‌ట్లు ఆయ‌న స‌ర‌దా ట్వీట్ చేశారు. సినీ పరిశ్రమలో చాలామంది చిరు ఈ ఛాలెంజ్‌లో ఎప్పుడెప్పుడు పాల్గొంటారా అని ఎదురు చూస్తున్నారు.