రాజమౌళి, మహేష్, దుర్గా ఆర్ట్స్ సినిమా ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన జక్కన్న

తన తర్వాతి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్నట్టు వెల్లడించిన దర్శక ధీరుడు రాజమౌళి..

రాజమౌళి, మహేష్, దుర్గా ఆర్ట్స్ సినిమా ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన జక్కన్న

తన తర్వాతి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్నట్టు వెల్లడించిన దర్శక ధీరుడు రాజమౌళి..

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఓ సినిమా తెరకెక్కనుందనే వార్త మీడియా, సోషల్ మీడియాతో పాటు ఫిలిం వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. జక్కన్న ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో ‘రౌద్రం ర‌ణం రుధిరం’(RRR) సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తారనే విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా రాజమౌళినే  క్లారిటీ ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్.నారాయణ నిర్మించనున్నారని కూడా కన్ఫామ్ చేశారు రాజమౌళి.

Read Also : సెలబ్రిటీ పనిమనిషి కూడా సెలబ్రిటీనే!..

పాపులర్ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డితో కలిసి పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు నారాయణ. ఇప్పటికే ఈ కథపై తండ్రి విజయేంద్ర ప్రసాద్ వర్క్ చేస్తున్నారని జక్కన్న తెలిపారు. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్, ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.